Pooja Hegde: టాలీవుడ్ కి దూరం జరిగిందా లేక పెట్టేసారా..?

Pooja Hegde.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ప్రముఖ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్ కి దూరం అయ్యిందా? లేక ఆమెనే దూరం పెట్టేశారా? అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.. ప్రస్తుతం పూజా హెగ్డేను తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మరిచిపోయిందా? ఎందుకంటే కొత్త అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకుంటున్నారు. మొత్తానికైతే ఈమె గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా..? అసలు ఈ ఏడాది ఈమెకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి..? ఇక రియాల్టీని అర్థం చేసుకొని పూజ కూడా బాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తోందా ..? అసలు ఏం జరుగుతోంది..? అనే విషయాలు అభిమానులలో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.. దీనికి తోడు పైగా ఈమె బాలీవుడ్ లోనే బుల్లితెర నటుడిని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్త తెరపైకి రావడంతో అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

Pooja Hegde: Has she moved away from Tollywood?
Pooja Hegde: Has she moved away from Tollywood?

అవకాశాలు లేక ఫోటోషూట్స్ తో టైం పాస్..

మనం చెప్పినట్టు జరిగేది సినిమా.. కానీ ఇది జీవితం.. దేవుడు ఎలా తలిస్తే అలా జరుగుతుంది.. ముఖ్యంగా ఎంత పెద్ద హీరోయిన్ కెరియర్ అయినా సరే ఏదో ఒక సమయంలో ఎక్స్పైర్ డేట్ అవ్వాల్సిందే.. ఇప్పుడు పూజా హెగ్డే విషయంలో కూడా అదే జరుగుతోందనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది.. అంతేకాదు పలు ఫోటోషూట్స్ తోనే కాలం గడిపేస్తోంది కూడా.. రకరకాల ఫోటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంది.. కానీ ఇప్పటివరకు ఒక సినిమాని కూడా చేయలేదు. దీంతోనే అభిమానులలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి.

టైర్ -1 కాకపోతే టైర్ -2 హీరోల కోసం ఎదురుచూపు..

ఇకపోతే టాప్ సెలబ్రిటీగా మారిపోయిన తర్వాత తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అందరితో కూడా జోడి కట్టింది. టైర్ -1 హీరోల నుంచి అవకాశాలు రాకపోవడం తో నెక్స్ట్ లిస్టులో ఉన్న రవితేజ, సాయి తేజ్, నితిన్ వంటి హీరోల నుంచి పిలుపులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తోంది.. కానీ ఇప్పటి వరకు అయితే అక్కడి నుంచి కూడా ఆఫర్స్ లభించడం లేదు..పైగా గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి.. సెట్లోకి తీసుకున్నారు కూడా కానీ ఏమైందో తెలియదు సినిమా నుంచి ఆమెను తప్పించేశారు.

- Advertisement -

బాలీవుడ్ పైనే ఫోకస్..

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కోయి షక్ సినిమాతోపాటు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న సంకీ లో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఎలాగో తెలుగులో అవకాశాలు రావడం లేదు కాబట్టి.. బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ఇక కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు ఎంచక్కా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది..ఇకపోతే అవకాశాలు వస్తే హ్యాపీ రాకపోతే ఇంకా హ్యాపీ అన్న రేంజ్ లో ఉన్న పూజ హెగ్డే కి ఇటీవలే టాలీవుడ్ నుంచి అవకాశం వచ్చినట్లు సమాచారం ..

మళ్ళీ చైతూ తో జోడీ..

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఈమె నటిస్తోంది.. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.. ఇదిలా ఉండగా ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు పదేళ్ళ క్రితం ఒక లైలా కోసం సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. అప్పట్లో చైతు సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇప్పుడు మళ్లీ చైతు సినిమాతో తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఏ మేరకు అవకాశాలు తలుపు తడతాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు