Pooja Visweswar: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రశాంత్ నీల్ అద్భుతమైన విజయాన్ని అందించారని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన “సలార్ – ది సీజ్ ఫైర్ ” మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రభాస్ అభిమానులకు మంచి విందు భోజనాన్ని తినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చిన్న నటీనటులకు కూడా మంచి క్యారెక్టర్ పడింది.
దీంతో ప్రతి ఒక్కరికి ఒక్కసారిగా గుర్తింపుతో పాటు వారి పేరు కూడా మారుమ్రోగిపోయింది. పైగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం రూ.600 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమాలో ఒకటి రెండు సీన్లలో కనిపించిన నటీనటులకు కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే అతి చిన్న క్యారెక్టర్ లో కొన్ని నిమిషాలే కనిపించిన పూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ మూవీ చూసినవారు ఈ క్యారెక్టర్ గురించి ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో “కాటేరమ్మ రాలేకపోయింది కానీ బదులుగా కొడుకుని పంపించింది ” అన్న డైలాగ్ తో ఫేమస్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్ సయ్యద్ ఫర్జానా.. ఇక ఆ యువతిని విలన్ కోరగా ఆమెను ముస్తాబు చేసేందుకు సిద్ధం చేసే పాత్రలో ఓ బోల్డ్ క్యారెక్టర్ లో ఇద్దరు మహిళలు నటించారు.
అందులో” రెండు నిమిషాలు ఇవ్వు బావ.. దొరసానిలా తయారు చేస్తాను”.. అన్న ఒకే ఒక్క డైలాగుతో ఫేమస్ అయ్యింది. అందులో ఒక నటి పేరే పూజా విశ్వేశ్వర్. ఆమె చెప్పిన ఈ డైలాగుకి ట్రోల్స్ కూడా ఫేమస్ అయ్యాయి. ఈమె ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలలో నటించినప్పటికీ కూడా ఈ సినిమానే ఈమెకు మంచి గుర్తింపు ఇచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో పనిచేయడం, హిట్ కొట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపింది. ఇక అలా ఒక్క డైలాగ్ తో భారీ పాపులర్ అయిన ఈమె తాజాగా రక్తం మడుగుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
పూజా విశ్వేశ్వర్ బైక్ లో వెళ్తుండగా బైక్ స్కిడ్ అయ్యి వైజాగ్ లోనే అనకాపల్లి హైవేలో డివైడర్ కి ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది. యాక్సిడెంట్లో ముఖానికి బాగా గాయాలు తగిలినట్లు.. ఒక కన్ను బాగా ఉబ్బిపోయి రక్తం కారుతూ ఉండడం మనం చూడవచ్చు. ఈమెను ఇలాంటి స్థితిలో చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖానికి బాగా గాయాలు తగలడంతో ఆమె కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక పూజా విశ్వేశ్వర్ నటించిన సినిమాల విషయానికి వస్తే.. గాడ్ ఫాదర్ , టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలలో నటించిన ఈమె త్వరలో వైవా హర్ష తో సుందరం మాస్టర్, పార్వతీశం యాష్ ఎం ఎం తో పాటు దక్షిణ అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిపింది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify