Poonam Kaur : ఈవిల్ నేచర్… గురూజీని మళ్ళీ గెలికిన పవన్ హీరోయిన్ నెటిజన్నూ వదల్లేదుగా

Poonam Kaur : తరచుగా వివాదాలతో వార్తల్లో నిలిచే హీరోయిన్లలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. సామాజిక బాధ్యతల నుంచి మొదలుకొని వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా వెల్లడించే ఈ హీరోయిన్ అప్పుడప్పుడు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాల్లో ట్వీట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంది. ఈ హీరోయిన్ మరోసారి గురూజీని గెలికింది. ఆయనకు సపోర్ట్ చేసిన ఓ నెటిజన్ కు కూడా ఇచ్చి పడేసింది.

వివాదం ఏంటంటే?

సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు డార్క్ కామెడీ పేరుతో వేసిన వెకిలి వేషాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై మెగా హీరో సాయి ధరం తేజ్ స్పందించడంతో మరింత దుమారం రేగింది. అతన్ని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ విన్పించడంతో ఎట్టకేలకు హనుమంతును అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే జల్సా సినిమాలో బ్రహ్మానందం, పవన్ కళ్యాణ్ మధ్య నడిచే సీన్స్ లో రన్ అవుతున్న డైలాగ్స్ ను చాలా మంది నెటిజెన్లు షేర్ చేస్తూ, సాయి ధరం తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా రియాక్ట్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూనమ్ మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విరుచుకుపడింది.

- Advertisement -

సోషల్ మీడియాలో డైరెక్ట్ గా దాడికి దిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు… అతని నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం తప్పే అవుతుంది అన్నట్టుగా పూనమ్ కామెంట్ చేసింది. దీంతో వెంటనే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ మీ వ్యక్తిగత సమస్యలను, పగలను సోషల్ మీడియాలో చూపించొద్దు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ గురూజీని వెనకేసుకొచ్చాడు సదరు నెటిజన్. ఇంకేముంది ఆ నెటిజన్ కి పూనమ్ మళ్ళీ నోరు లేపకుండా ఇచ్చి పడేసింది.

పూనమ్ ఘాటు రిప్లై…

తనకే ఉచిత సలహా ఇచ్చిన సదరు నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చింది పూనమ్ కౌర్. అతని ఈవిల్ నేచర్ గురించి నాకు తెలుసు. అలాగే మగవాళ్ళు ఈగో కోసం అతన్ని సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలుసు. నీ అనుభవంతో నువ్వు మాట్లాడితే నా అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు. అతని స్వభావం ఏంటో నాకు తెలుసు అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ట్వీట్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగానే పూనమ్ ట్వీట్స్ అంటే చాలు కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కొంతమంది అనడం కన్నా గురూజీ, పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరిద్దరి గురించే ఆమె ఎక్కువగా ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. మెయిన్ గా గురూజీని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె నోరు విప్పితే అలాంటి దారుణమైన విషయాలను బయట పెడుతుంది మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు