Prabhas.. టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అటు డైరెక్టర్ లు ఇటు నిర్మాతల విషయంలో ఎన్నోసార్లు గొప్ప మనసు చాటుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో కండీషన్ వంటివి అసలు పెట్టుకోరు. ముఖ్యంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలామంది సెలబ్రిటీలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ తన ఇంటి నుంచి స్వయంగా భోజనాన్ని తెప్పిస్తూ ఉండడమే కాకుండా.. ఎంతోమంది అడిగిన సహాయాన్ని కాదనకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ మరొకసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.
వయనాడ్ లో వరద బీభత్సం..
అదేమిటంటే కేరళలోని వయనాడ్ లో వరద బీభత్సం గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 300 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది గల్లంతయినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే వీరందరిని ఆదుకోవడానికి చాలామంది సినీ సెలబ్రెటీలు ఇతర భాషల వారు కూడా విరాళాలు ప్రకటించడం జరిగింది. ఇప్పటికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి అటు అల్లు అర్జున్ , మెగా కుటుంబం తో పాటూ ఇతర సినీ సెలబ్రిటీలు కూడా విరాళాలను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ లిస్టులో ప్రభాస్ చేరిపోయారు.
వరద బాధితుల కోసం రూ.2 కోట్లు ఇచ్చిన ప్రభాస్..
కేరళ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.25 లక్షల రూపాయలు ఇవ్వగా.. రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు కలిసి కోటి రూపాయలు సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీరందరిని మించిపోయి మరీ ప్రభాస్ ఏకంగా 2 కోట్ల రూపాయలు సైతం ఆ వరద బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అటు అభిమానులు సైతం సంబరపడిపోతున్నారు.. కేరళలో కూడా ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.
దక్షిణాది నుంచి సెలబ్రిటీ విరాళాలు..
ఇప్పటికే దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి సూర్య , జ్యోతిక, రష్మిక , నయనతార తదితర సెలబ్రిటీలు సైతం లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. అయితే తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేవలం అల్లు అర్జున్, రామ్ చరణ్ , ప్రభాస్, చిరంజీవి మాత్రమే విరాళాలు ఇచ్చారు. మరి మిగిలిన సెలబ్రిటీలు కూడా విరాళం ప్రకటిస్తే బాగుంటుంది అంటూ అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.
ప్రభాస్ కెరియర్..
కెరియర్ పరంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ప్రభాస్.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఇలాంటి గొప్ప గొప్ప సహాయాలు అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సలార్-2, స్పిరిట్ వంటి చిత్రాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. వీటితోపాటు మరో రెండు మూడు చిత్రాలు ఆయన లైన్ లో పెట్టినట్లు సమాచారం.