Prabhudeva : ప్రభుదేవా ఇంట్లో విషాదం

Prabhudeva : పాపులర్ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు ప్రభుదేవా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అమ్మమ్మ పుట్టమ్మని తాజాగా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. ఏజ్ సంబంధిత సమస్యలతో పుట్టమ్మని తుది శ్వాస విడిచినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన ప్రభుదేవా హుటా హుటిన మైసూరు చేరుకున్నారు. ఈరోజు జరనున్న తన అమ్మమ్మ అంత్యక్రియలకు ప్రభుదేవా తమ్ముళ్లు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ లతో కలిసి ప్రభుదేవా కూడా వచ్చాడు. పుట్టమ్మని మరణంతో ప్రభుదేవా కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Prabhu Deva Wiki, Biography, Age, Gallery, Spouse and more

హుటాహుటిన సొంతూరుకు ప్రయాణం

కాగా కర్ణాటకలోని మైసూర్ లో జన్మించిన ప్రభుదేవా ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమ్మమ్మ కన్నుమూత గురించిన షాకింగ్ వార్త తెలుసుకున్న ప్రభుదేవా ఆమెను చివరి చూపు చూడడానికి, అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెంటనే మైసూరు బయలుదేరారు. మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సొంత గ్రామం అయిన ధురకు ప్రయాణమయ్యారు. అనంతరం అమ్మమ్మ పుట్టమ్మని అంత్యక్రియలను పూర్తి చేశారు.

- Advertisement -

ప్రభుదేవా ఫ్యామిలీ ట్రీ

మైఖేల్ జాక్సన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ప్రభుదేవా తల్లి అయిన మహదేవమ్మ తల్లి పుట్టమ్మన్నీ. ఆయన తండ్రి ముగురు సుందర్ కు ఆమె అత్తగారు. వాస్తవానికి మైసూర్‌కు చెందిన ప్రభుదేవా చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు తిరిగి తన స్వగ్రామానికి వచ్చినప్పుడు తన అమ్మమ్మతో కలిసి పిక్స్ దిగడమే కాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.

ప్రముఖ నృత్య కళాకారుడు మూగురు సుందరం టి.నరసీపూర్ తాలూకాలోని మూగూరు గ్రామానికి చెందినవారు. ధుర గ్రామ ఉపాధ్యక్షుడు మహదేవప్ప, పుట్టమ్మన్ని కుమార్తె మహదేవమ్మతో సుందరంకు వివాహమైంది. తర్వాత ఆయన సినిమా రంగంలో సక్సెస్ అయ్యి చెన్నైలో స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారులు రాజు, ప్రభుదేవా, నాగేంద్ర సుదూర గ్రామంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లి అప్పుడప్పుడు కాలక్షేపం చేసేవారు. ఇక తాజాగా ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అని తెలిసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ప్రభుదేవా చేతిలో ఉన్న సినిమాలు

నటుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవ లైనప్‌లో వరుస సినిమాలు ఉండడంతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గోట్’లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. మరోవైపు ప్రభుదేవా మరో హిందీ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దాదాపు 27 ఏళ్ల తర్వాత నటి కాజోల్ అగర్వాల్‌తో కలిసి ప్రభుదేవా ఈ హిందీ చిత్రంలో నటించనున్నారు. వీరిద్దరూ చివరిసారిగా రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన మిన్సార కనవు అనే తమిళ చిత్రంలో కలిసి కనిపించారు. తెలుగులో మెరుపు కలలు పేరుతో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు 27 ఏళ్ల తరువాత తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఈ కాంబో మళ్లీ రిపీట్ కానుంది. ఈ మూవీ టిజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు