Prashanth Neel Movies Television TRP’s : పడిపోతున్న ప్రశాంత్ సినిమాల టీఆర్పీ రేటింగ్స్…. సలార్ పరిస్థితి ఏంటంటే?

Prashanth Neel Movies Television TRP’s : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో ప్రశాంత్ స్టైల్ లో వచ్చే హీరో ఎలివేషన్, యాక్షన్ సన్నివేశాలకు ఊగిపోయే రేంజ్ లో ఆయన సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ టీవీలలో మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఫలితం కనిపిస్తోంది. బుల్లితెర ఆడియన్స్ ప్రశాంత్ నీల్ సినిమాలపై ఆసక్తిని కోల్పోతున్నారా అనే కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి తాజాగా బయటకు వచ్చిన ఆయన గత మూడు సినిమాల టిఆర్పి రేటింగ్స్. అదికూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్, కేజిఎఫ్ 2, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాలకు ఒక్కొక్కటిగా టీఆర్పీ రేటింగ్స్ పడిపోతూ వస్తుండడం గమనార్హం.

మూడు సినిమాల టీఆర్పీ ఎంత అంటే?

ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ మూవీతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన విషయం తెలిసింది. ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సీక్వెల్ కేజిఎఫ్ 2తో ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించాడు. అలాగే గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన సలార్ మూవీ హిట్ తో డార్లింగ్ ప్రభాస్ కు సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ మూడు సినిమాలకు కూడా థియేటర్ లతో పాటు ఓటిటిలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీవీలో మాత్రం ఊహించని విధంగా అతి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. కేజిఎఫ్ చాప్టర్ 1కు 11.90 అంటే మంచి టిఆర్పి రేటింగ్ వచ్చింది. కానీ ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2కు 9.15కు పడిపోయింది టీఆర్పీ. సలార్ మూవీకి దారుణంగా 6.52 టీఆర్పి రేటింగ్ వచ్చింది. మరి బుల్లితెర ఆడియన్స్ ప్రశాంత్ నీల్ సినిమాలపై ఆసక్తిని కోల్పోతున్నారా? అంటే దీనికి సమాధానం అవును అనే విన్పిస్తోంది.

ఇదే కారణమా?

కేవలం ప్రశాంత్ నీల్ సినిమాలే కాదు మిగతా మూవీస్ విషయంలో కూడా ఇలాగే ఉంది పరిస్థితి. దీనంతటికి ఓటిటిలే కారణం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన 45 రోజుల్లోనే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఆ తర్వాత ఒకసారి సబ్స్ట్రిక్షన్ తీసుకుంటే ఓటీటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన సినిమాను చూసే వీలును కల్పిస్తున్నాయి. దీంతో అప్పటికే థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలను వీక్షించిన ఆడియన్స్ వాటినే మళ్లీ టెలివిజన్ లో చూడడానికి పెద్దగా ఆసక్తిని చూపించట్లేదు. ఆ ఎఫెక్ట్ కారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాలకు కూడా నెమ్మదిగా ఇలా రేటింగ్ పడిపోతూ వచ్చింది.

- Advertisement -

కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. రాజా సాబ్ మూవీ సెట్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాదే సలార్ 2 షూటింగ్ లో చెరనున్నారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు ప్రశాంత్ నీల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు