నటుడు బబ్లూ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తరువాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పృథ్విరాజ్ ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా పృథ్వీ రెండో పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ వార్తలపై పృథ్వీ స్పందించారు. “ఎంతో కాలం నుంచి తెలుగు వారు నన్ను ఆదరిస్తున్నారు. రెండో పెళ్లి గురించి విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే తాను శీతల్ అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్టు వెల్లడించారు. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 24 ఏళ్లు. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో బయటికి వచ్చేసి వేరుగా ఉంటున్నాను.
ఒంటరితనం మనిషికి ఉన్న కుంగుబాటుకి గురి చేస్తోంది. ఆ బాధను నేను అనుభవించాను. అలాంటి సమయంలోనే శీతల్ నాకు పరిచయమైంది. ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. వాస్తవానికి తొలుత నేను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించుకోవాలని చాలా సమయమిచ్చాను. కానీ ఆమె నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రేమకి వయస్సుతో ఏం సంబంధం అని, ఏ వయస్సులో ప్రేమలో పడుతారో ఎవ్వరూ చెప్పలేరు” అంటూ పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.