Prithviraj Sukumaran : క్రేజీ ప్రాజెక్టులతో వరదరాజ మన్నార్ యమ బిజీ.. లైనప్ చూస్తే..!

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృత్విరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో మోహన్ లాల్, మమ్మూట్టి తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ తెలుగులో ప్రభాస్ సలార్ సినిమాలో వరద రాజమన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక ఈ ఇయర్ ఆల్రెడీ ‘ది గోట్ లైఫ్’, ‘గురువాయూర్ అంబాలనదయిల్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించాడు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లకి పైగా వసూలు చేసాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండగా, ఆ క్రేజీ లైనప్ మామూలుగా లేదని చెప్పాలి.

Prithviraj Sukumaran Upcoming Projects Lineup in 2025

క్రేజీ ప్రాజెక్టులతో పృత్వి రాజ్ బిజీ బిజీ..

ఇక పృత్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రస్తుతం మలయాళంలో అందరి స్టార్ల కన్నా ఎక్కువ బిజీ అయ్యాడని చెప్పాలి. అరడజనుకి పైగా ప్రాజెక్టులు సెట్స్ పై ఉంచాడు ఈ మలయాళ స్టార్. ఈ ఏడాదే కాదు వచ్చే 2025 ఏడాదిలో కూడా క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం విలయత్ బుద్ధ అనే సినిమా చేస్తుండగా, ఆ వెంటనే మోహన్ లాల్ తో లూసిఫెర్ సీక్వెల్ మొదలుపెట్టనున్నాడు. ఇక ఆ వెంటనే 2025 ప్రాజెక్టులు కూడా ఫిక్స్ అయిపోయాయి. అందులో “కాళియన్” పేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోగా నటిస్తుండగా, ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. దాంతో పాటు మహేష్ – రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB29 లో ప్రతినాయకుడిగా నటించనున్నాడు. అలాగే సలార్ శౌర్యంగ పర్వం కూడా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాల మధ్యలో మరో మలయాళం ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు.

- Advertisement -

తెలుగు ఆడియన్స్ కు చేరువైన పృత్విరాజ్..

ఇక సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పృథ్వీరాజ్ సుకుమారన్ వరుసగా తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. మహేష్ – రాజమౌళి SSMB29 లో నటిస్తుండగా, ఈ సినిమా కోసం ఏకంగా 120 రోజుల డేట్లు కేటాయించాడట. అలాగే శౌర్యంగ పర్వం సీక్వెల్ కూడా ఉంది. ఇక రామ్ చరణ్ – సుకుమార్ RC17 కాంబోలో కూడా పృత్వి రాజ్ నటించే అవకాశం ఉందని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు