Celebrities on All eyes on Rafah : ఇది ఒక కాన్సర్ట్… ఓ మలయాళం మూవీ?

Celebrities on All eyes on Rafah : ఇండియా లో నిన్నటి నుండి సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ఒక పోస్ట్ మరింత ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, దాంతో పాటు ఇండియాలో కూడా పలువురు సెలెబ్రిటీలు షేర్ చేసిన పోస్ట్ “ఆల్ ఐస్ ఆన్ రఫా”. బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా, ఎంతో మంది సెలెబ్రిటీలు ఈ విషయం పై తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో స్టోరీస్ కూడా పెడుతున్నారు. అయితే చాలా మంది మామూలు జనాలకి అసలు ఈ పోస్ట్ గురించి అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. కొందరు సెలెబ్రిటీలు అయితే ఒకరు పోస్ట్ చేసారని మరొకరు చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోస్ట్ పెట్టి, ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్కెఎన్ (శ్రీనివాస కుమార్) సోషల్ మీడియాలో ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు.

Producer SKN reacted differently to All eyes on Rafah post

అసలు ‘అల్ ఐస్ ఆన్ రఫా’ పోస్ట్ ఏంటంటే..

అయితే చాలా మంది సెలెబ్రిటీలు పోస్ట్ చేస్తున్న అల్ ఐస్ ఆన్ రఫా పోస్ట్ (Celebrities on All eyes on Rafah) యొక్క వివరణ ఏంటంటే.. గత 9 నెలలుగా ఇజ్రాయేల్, హమాస్ ల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ యుద్ధం ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా సాగుతోంది. హమాస్ లో ఉన్న రఫాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయేల్‌ దేశం భీకర దాడులు సాగిస్తోంది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 45 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోగా.. కొన్ని వందల మంది ప్రజలు గాయపడ్డారు. ఇక సోమవారం, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారని సమాచారం. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యక్తంగా వైరల్ గా అవుతున్నాయి. ఆ హృదయ విదారకమైన ఫోటోలు ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలను సెలబ్రిటీలు షేర్ చేస్తూ.. “ఆల్ ఐస్ ఇన్ రఫా” అనే పోస్ట్ తో ఆ కాల్పులు ఆపాలని అభ్యర్ధిస్తున్నారు. ఇక సమంత, అలియా, ప్రియాంక చోప్రా, త్రిప్తి..లాంటి స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా ఈ పోస్ట్ ను షేర్ చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ నిర్మాత ఎస్కెఎన్ ఈ విషయంపై సెలెబ్రిటీల స్టేటస్ లకు డిఫరెంట్ గా ఒక ప్రశ్న వేస్తూ ట్వీట్ వేసాడు.

- Advertisement -

ఇది ఒక కన్సర్ట్ అట.. మలయాళం మూవీ పేరట – SKN

అయితే తాజాగా టాలీవుడ్ నిర్మాత SKN సూటిగా ఒక ప్రశ్న వేస్తూ పోస్ట్ వేసాడు. అసలు ఇండియాలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి పోస్ట్ నేను ఒక్కటి కూడా చూడలేదే..అంటూ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. అలాగే ” ఇన్‌స్టాలోని చాలా మంది సెలబ్రెటీలకు రఫాపై ఉన్న కంటెంట్ గురించి నిజంగా తెలుసా..? లేదా అందరూ ఒకే పోస్ట్‌ను ఫార్వర్డ్ మెసేజ్ లాగా షేర్ చేస్తున్నారా అని తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందని, ఎందుకంటే నిజంగా భారతదేశం గురించి ఇంతమంది పోస్ట్ చేయడం తానెప్పుడూ చూడలేదు” అంటూ SKN చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అలాగే ఆఫ్ లైన్ లో ఈ పోస్ట్ గురించి ప్రస్తావిస్తూ తనకి బయట ఎదురైన వ్యక్తుల మాటలు ఇలా ఉన్నాయన్నాడు. ఒక టాలీవుడ్ హీరోయిన్ ని ఈ పోస్ట్ గురించి అడిగితే అది కన్సర్ట్ కదా అని చెప్పుకొచ్చిందట. అలాగే మరో హీరోయిన్ మలయాళం సినిమా పేరేమో అని చెప్పుకొచ్చింది అన్నాడు. దీంతో నరాలు కట్ అయిపోయి మీమ్ మైండ్ లోకి వచ్చిందని ఎస్కెఎన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా ఇవన్నీ పీఆర్ స్టంట్స్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు