Puri Jagannadh: పని పాట లేని ఎదవలకే మనోభావాలు దెబ్బతింటాయి పూరి సంచలన కామెంట్స్

Puri Jagannadh: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల పేర్లు ప్రస్తావన లోకి వస్తే మొదటి వినిపించే పేరు పూరి జగన్నాథ్. అతి తక్కువ టైంలో సినిమా కథను రాసి డైలాగులు పూర్తి చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లి అతి త్వరగా షూటింగ్ అండ్ ఫినిష్ చేసి రిలీజ్ చేయడం పూరి జగన్నాథ్ స్టైల్. అలా తక్కువ రోజుల్లో ఫినిష్ చేసిన సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. పూరి వర్కింగ్ స్టైల్ చూసి చాలామంది డైరెక్టర్స్ కూడా ఫిదా అయిపోయే వాళ్ళు. అలానే అద్భుతమైన డైలాగ్స్ రాయటం హీరో క్యారెక్టర్ అని పవర్ ఫుల్ గా డిజైన్ చేయడం పూరి స్ట్రెంత్.

ఇక టెంపర్ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ సినిమాను పూరి జగన్నాథ్ ఇప్పటివరకు చేయలేకపోయాడు. వరుసగా ప్లాప్స్ తో సతమతం అవుతున్న టైంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా పూరీకి మంచి హిట్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాతోనే మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమాని చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ ను చవిచూసింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఒక హిట్ సినిమా కొట్టడం చాలా అవసరం.

Puri Jagannadh

- Advertisement -

ఇక పూరి జగన్నాథ్ ప్రజెంట్ రామ్ పోతినేని తో డబుల్ ఇష్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఒక సెకండ్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీనిలో కెసిఆర్ డైలాగ్ ఒకటి హుక్ లైన్ గా వాడారు. ఇక్కడితో చాలామంది మనోభావాలు దెబ్బతిని పూరి జగన్నాథ్ పైన కేసులు పెడితే సినిమాను బాయ్ కట్ చేయాలి అంటున్నారు. ఇకపోతే పూరి జగన్నాధకి ఇటువంటి అంశాలు కొత్తవి కాదు.

ఒక సందర్భంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరి మనోభావాలు దెబ్బతినవు. పని పాట లేని వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి అంటూ గతంలో చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ మీద కేసులు పెడుతున్న వారందరికీ ఈ వీడియో ఒక సమాధానమని చెప్పొచ్చు. ఇదివరకే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఇటువంటి వివాదమే జరిగింది. ఇక ఈ వివాదాన్ని పూరి ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు