Double Ismart : సెటిలైన లైగర్ వివాదం.. డిస్ట్రిబ్యూటర్లతో పూరి – చార్మి ఒప్పందం.. ఎవరికెంతంటే!

Double Ismart : పూరి జగన్నాథ్ – రామ్ పొతినేని కాంబోలో తెరకెక్కిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో పాటు, లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాకు ముందు నుండి ఉన్న సమస్య పూరిజగన్నాథ్ గత సినిమాల డిస్ట్రిబ్యూటర్లు అని తెలిసిందే. పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానివ్వమని చాలాసార్లు ప్రకటించారు. అయితే ఎట్టకేలకు ఈ వివాదం పరిష్కారమైంది.

Puri Jagannath - Charmi deal with Ligar Distributors

సెటిలైన లైగర్ వివాదం.. డిస్ట్రిబ్యూటర్లతో పూరి – ఛార్మి ఒప్పందం

ఇక పూరి జగన్నాథ్ – ఛార్మి కలిసి నిర్మించిన లైగర్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లతో తాజాగా డైరెక్టర్ నిర్మాత అయిన పూరి జగన్నాథ్ – అలాగే మరో నిర్మాత ఛార్మి తో కలిసి ఒప్పందం జరిగింది. లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ కి 8.5 కోట్ల వరకు ఇవ్వడానికి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ అంగీకరించారు. అయితే ఎవరెవరికి ఎంతవరకంటే.. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దీనిలో నైజాం ఏరియా కి 4 కోట్లు, ఆంధ్ర కి 4 కోట్లు, సీడెడ్ కి 50 లక్షలు, అలాగే వరంగల్ శ్రీను కు 1 కోటి ఇవ్వనున్నారని సమాచారం. అలాగే ఇప్పుడు 50 లక్షలు, డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యాక మరో 50 లక్షలు ఇవ్వనున్నారని సమాచారం. మొత్తం కలిపి 8.5 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం.

- Advertisement -

 

ఆగష్టు 15న భారీ ఎత్తున రిలీజ్…

ఇక తాజాగా ముగిసిన లైగర్ వివాదంతో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే అని చెప్పాలి. ఈ సినిమాని పూరి జగన్నాథ్ బయట ఫైనాన్స్ తీసుకుని మరీ నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న రిలీజ్ అవుతుండగా, ఈ సినిమాపై కూడా క్రేజీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, అలీ, షాయాజీ షిండే, గెటప్ శీను, మకరంద్ దేశ్ పాండే, ప్రగతి వంటి వారితో స్టార్ క్యాస్ట్ కూడా బాగా ఉంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు