Puri Jagannath: డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేది అప్పుడే

Puri Jagannath: బద్రి సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. మొదటి సినిమాతోనే అద్భుతమైన అందుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన బాచి సినిమా డిజాస్టర్ గా మిగిలింది. మళ్లీ రవితేజ హీరోగా చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పనిచేసిన ఘనత పూరి జగన్నాథ్ కి దక్కింది.

ఇకపోతే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా పూరి జగన్నాథ్ కెరియర్ లో పడలేదు. వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా కొంత ఉపశమనం కలిగించింది. ఈ సినిమా తర్వాత పూరి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో పరువును పోగొట్టుకున్నారు పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ.ఈ సినిమాకి సంబంధించి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు పూరి ఇంటి ముందు ధర్నాకు తిరిగే పరిస్థితి కూడా వచ్చింది.

Puri Jagannadh

- Advertisement -

ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పూరి జగన్నాథ్ మణిశర్మ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరు కూడా ఇప్పుడు వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి రెండో మాస్ సాంగ్ రిలీజ్ చేయబోతుంది చిత్ర యూనిట్. జులై 16న ఈ సెకండ్ సింగిల్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ పాటను సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ రచించారు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు