Double Ismart : హీరో గారి యాటిట్యూడ్ మ్యాటర్…? విసిగిపోయిన డైరెక్టర్… ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్?

Double Ismart : ఇప్పుడు ఎక్కడ విన్నా డబుల్ ఇస్మార్ట్ సినిమా పేరే వినిపిస్తుంది.. ఈ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదనే టాక్ వినిపిస్తుంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. డైరెక్టర్ కు హీరోకు ఏవో గొడవలు ఉండటం వల్లే ప్రమోషన్స్ చెయ్యట్లేదనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది…? ఎందుకు గొడవలు అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

గతంలో పూరి జగన్నాథ్‌తో ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెలలో విడుదల కాబోతుంది. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఇప్పటివరకు ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ అంటూ మేకర్స్ ఎక్కడా హడావిడి చేసినట్లు లేదు. అందుకు కారణం హీరో, డైరెక్టర్ మధ్య ఉన్న గొడవలే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Puri Jagannath is releasing the film without promotions due to hero attitude
Puri Jagannath is releasing the film without promotions due to hero attitude

సినిమా షూటింగ్ టైం లో డైరెక్టర్ చెప్పిన మాటలను హీరో పెడ చెవిన పెట్టాడట. అది పూరికి విపరీతమైన కోపాన్ని కలిగించిందట. డైరెక్టర్ పూరి హీరో యాటిట్యూడ్ భరిస్తూ వస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని పూరి కూడా తన సన్నిహితులతో కూడా చర్చించినట్టు Filmify కి సమాచారం అందింది. హీరో పెట్టిన టార్చర్ కి విసిగిపోయిన డైరెక్టర్ తన సినిమాను ప్రమోషన్స్ చేయకుండానే రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారట. ఇప్పటికే పూరి జగన్నాథ్ లైగర్ నష్టాల ఇష్యూతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదే టైంలో హీరో రామ్ పోతినేని నుంచి వస్తున్న టార్చర్ ను అస్సలు భరించలేకుండా ఉన్నారట. అలాగే మరోసారి రామ్ తో సినిమా చేయ్యాలనే ఆలోచన కూడా తనకు రావడం లేదని, తన స్నేహితులతో పూరి చెప్పారట.

- Advertisement -

ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సినిమాకు మాత్రం ప్రమోషన్స్ లేవని తెలుస్తుంది.. ఇన్ని గొడవల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

కాగా, ఈ సినిమాను నైజం రైట్స్ ను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి దాదాపు 54 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే, డబుల్ ఇస్మార్ట్ మూవీకి ప్రమోషన్స్ చేయకపోతే, నిరంజన్ రెడ్డికి కూడా నష్టాలు వచ్చే ఛాన్స్ లేకోపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు