Radhika Sarath Kumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ముఖ్యంగా పోటీ చేసిన ప్రధాన అభ్యర్థులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ఫలితాలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా తమ అభ్యర్థులు గెలవాలని పార్టీ శ్రేణులు , నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అంగ ప్రదక్షిణలు, పొర్లు దండాలు కూడా చేస్తున్నారు.. ఇక దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెల్లడి కానున్నాయి.
లోక్సభ ఎంపీగా పోటీ చేసిన రాధికా శరత్ కుమార్..
ఇక ఇందులో భాగంగానే ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూడా దేవాలయంలో ప్రదక్షిణలు చేశారు.. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన తన భార్య రాధిక విజయం సాధించాలని కోరుకుంటూ ప్రముఖ సీనియర్ నటుడు రాధిక భర్త శరత్ కుమార్ పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . లోక్సభ ఎన్నికల్లో విరుధ్ నగర్ బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు రాధికా శరత్ కుమార్.. మొదటి విడతలో భాగంగా తమిళనాడులో ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరిగింది.. మంగళవారం జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్న ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల ఫలితాలు ముందు రాధికా శరత్ కుమార్ దంపతులు ఆదివారం రాత్రి తమిళనాడులోని విరుధ్ నగర్ లో ఉన్న శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించారు..
రాధిక గెలుపు కోసం పాట్లు..
ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం. అనంతపురం లోక్సభ ఎన్నికలలో తన భార్య గెలవాలి అని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయ ప్రాంగణంలో అంగప్రదక్షిణలతో పాటు పొర్లు దండాలు కూడా పెట్టారు రాధిక శరత్ కుమార్.. రాధికతో పాటు నరేంద్ర మోడీ ప్రధాని కూడా గెలవాలని శరత్ కుమార్ అమ్మవారికి ముక్కులు చెల్లించారు. ఇక ఇక్కడ రాధికా తో పాటు రాధిక సన్నిహితులు , స్నేహితుల సమక్షంలో శరత్ కుమార్ పొర్లు దండాలు పెట్టడం విశేషం.. ఇకపోతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి రాధిక వెన్నంటే ఉంటూ ఆమెతోపాటు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు..
భార్య గెలుపు కోసం అంగ ప్రదక్షిణలు చేస్తున్న శరత్ కుమార్..
శరత్ కుమార్ నేపథ్యంలోనే తన భార్యతో పాటు ప్రధాని మోదీ కూడా గెలవాలని కోరుకుంటూ శరత్ కుమార్ ఇప్పుడు ఇండియా ప్రధానమంత్రి మోడీ రావాలి అని కోరుకుంటూ.. ఇలా అంగప్రదక్షిణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అందరూ ఈయన కోరిక ఫలించాలని కోరుకుంటున్నారు.. మరి లోక్సభ ఎన్నికల్లో రాధిక గెలుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఎకరాధికా విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక అంతే కాదు అటు సినిమాలలో ఇటు రాజకీయాల్లో కూడా దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తోంది.. అందులో భాగంగానే లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్న ఈమె గెలుస్తుందో లేదో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika’s success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8
— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024