Raj Tarun – Lavanya: మరో కొత్త ట్విస్ట్.. A1, A2 గా ఎవరిని చేర్చారంటే..?

Raj Tarun – Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తేజ్ కేస్ లో రోజుకొక కొత్త మలుపు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. రాజ్ తరుణ్ తనను ప్రేమించి.. మోసం చేశాడని.. గర్భవతిని చేసి అబార్షన్ కూడా చేయించాడని.. మాల్వీ కోసమే తనను వదిలేసాడని.. అంతేకాదు మాల్వీ తన సోదరుడితో కలిసి చంపేస్తానని బెదిరిస్తోంది అంటూ రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీసుల ముందు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే మరోవైపు తనకు, తన సోదరుడికి మెసేజ్లు పంపుతోంది లావణ్య అంటూ హీరోయిన్ మాల్వి మల్హోత్రా చెబుతూ.. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Raj Tarun - Lavanya: Another new twist.. Who has been included as A1, A2..?
Raj Tarun – Lavanya: Another new twist.. Who has been included as A1, A2..?

A1 గా రాజ్ తరుణ్ , A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రా..

లావణ్య.. తనకు అబార్షన్ చేయించాడనే సాక్షాలను పోలీసుల ముందు పెట్టడంతో నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు.. ఇందులో A 1గా రాజ్ తరుణ్ , A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాలను చేర్చారు నార్సింగి పోలీసులు. అంతేకాదు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలపై సెక్షన్ 420 , సెక్షన్ 493, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు..

ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన నిజాలు..

లావణ్య ఈ ఫిర్యాదులో ఎన్నో విషయాలను ప్రస్తావించింది.. ముఖ్యంగా రాజ్ తరుణ్ తనకు ఎప్పుడు? ఎలా పరిచయమయ్యారు? అనే విషయాన్ని మొదలుపెట్టి.. ఇప్పటివరకు ఏం జరిగింది అనే విషయాలను కూడా ఆమె ప్రస్తావించింది. ఆమె అందులో 2008 నుంచి రాజ్ తరుణ్ తో నాకు పరిచయం ఉంది ..2010లో రాజ్ తరుణ్ నాకు లవ్ ప్రపోజ్ చేశాడు.. 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడు.. అనంతరం రాజ్ తరుణ్ ను మా కుటుంబం చాలా బాగా ఆదరించింది. అవసరమైన ప్రతిసారి డబ్బులు ఇస్తూనే వచ్చాము.. అలా మొత్తంగా గతంలో నేను రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలు ఇచ్చాను. రాజ్ తరుణ్ కుక్కల వల్ల ఆరు సంవత్సరాల లో ఆరు ఇల్లు మారాల్సి వచ్చింది.. ఇక 2016లో రాజు తరుణ్ వల్లే నేను గర్భవతిని అయ్యాను.. రెండో నెలలోనే నాకు అబార్షన్ చేయించాడు .. అంతేకాదు హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా రాజ్ తరుణ్ పే చేశారు.. ఇక నేను యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నన్ను అరెస్టు చేశారు అంటూ తెలిపింది లావణ్య.. అంతేకాదు తనను అనవసరంగా డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్, మాల్వి ఇరికించారు.. కోర్టు రిమాండ్ కు తరలించగా 45 రోజులపాటు జైల్లో ఉన్నాను అంటూ లావణ్య ఆరోపించింది.. తనను ప్రేమ పేరుతో మోసం చేసిన రాజ్ తరుణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారని వారి నుండి రక్షణ కల్పించాలని కూడా కోరుతోంది లావణ్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు