Raj Tarun – Lavanya: ఇష్యూ పై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా..!

Raj Tarun – Lavanya…టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పేరు గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.. ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశారంటూ కోకాపేటకు చెందిన లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ పైన పోలీస్ ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకోవడం వల్లే.. తనను వదిలేసాడంటూ కూడా ఆరోపణలు చేసింది లావణ్య.. అంతేకాకుండా తనను చంపేస్తామంటూ బెదిరిస్తోంది అంటూ కూడా తెలియజేసింది. ఈమె సోదరుడు కూడా తనను బెదిరించారంటూ పోలీస్ ఫిర్యాదులో లావణ్య వెల్లడించింది.

Raj Tarun - Lavanya: Heroine Malvi Malhotra gave a twist on the issue..!
Raj Tarun – Lavanya: Heroine Malvi Malhotra gave a twist on the issue..!

నిజం ఒప్పుకున్న రాజ్ తరుణ్..

ఈ విషయం వైరల్ గా మారడంతో సినీ హీరో రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చి తనతో లావణ్య కలిసి ఉన్న మాట నిజమే.. అయినప్పటికీ నేను లావణ్యతో విడిపోయి దాదాపుగా మూడు సంవత్సరాల పైనే అవుతోంది.. అది కూడా ఎందుకంటే ఆమె డ్రగ్స్ కు , మందుకు బానిస అయ్యింది.. ఆమె టార్చర్ భరించలేక.. ఆమెతో దూరంగా ఉన్నాను అని తెలిపారు. లావణ్య తననే కాదు చాలామందిని ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తోంది అంటూ తన దగ్గర ప్రూఫ్ లు ఉన్నాయి అంటూ మీడియా ముందు కూడా చూపించారు రాజ్ తరుణ్.

భారీ ట్విస్ట్ ఇచ్చిన మాల్వి మల్హోత్ర..

అలాగే తనతో నటించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఇదంతా కేవలం లావణ్య ఆడుతున్నటువంటి ఒక కట్టు కథ అన్నట్లుగా తెలియజేశారు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ తో కలిసి తిరగబడరా సామి అనే చిత్రంలో మాల్వి మల్హోత్రా హీరోయిన్గా నటించింది. అయితే ఈ విషయం అటు హీరోయిన్ వద్ద వరకు వెళ్ళగా.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా పోలీసులను ఆశ్రయిస్తూ లావణ్యను తాను అసలు కలవనే లేదని.. తనను తన కుటుంబాన్ని ఈమె బెదిరిస్తోందని.. తన కుటుంబం గురించి తప్పుగా ప్రచారం చేస్తోంది.. ముఖ్యంగా తన గురించి తన సోదరుడు గురించి లావణ్య బెదిరించినట్లు చెబుతోంది అందులో వాస్తవం లేదంటూ తెలిపింది.

- Advertisement -

ఆమెపై యాక్షన్ తీసుకోవాలంటున్న హీరోయిన్..

కేవలం తమను ఇరికించాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలా తమ పేర్లను తెలియజేస్తోంది అంటూ మాల్వి మల్హోత్రా తెలియజేసింది.. ఈమె పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డిసిపికి ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే రాజ్ తరుణ్ తో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని.. దాదాపుగా రాజ్ తరుణ్ తో తాను కాంటాక్ట్ లో లేక ఎనిమిది నెలలు అవుతోంది.. కేవలం ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసమే మాట్లాడుతున్నానని తెలిపింది. సమస్య అంతా వారిద్దరిదే కానీ వారి గొడవలోకి తనని లాగారు.. రాజ్ తరుణ్ తో కేవలం స్నేహం మాత్రమే ఉన్నది అంటూ తెలిపింది మాల్వి మల్హోత్రా. మొత్తానికి అయితే లావణ్య వీళ్ళని ఆడుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరొకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లావణ్య కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. సరైన ఆధారాలను చూపించాలని కూడా తెలిపారు.. ప్రస్తుతం లావణ్య పరారీలో ఉన్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు