Raj Tarun – Lavanya: లావణ్య సూసైడ్ నోట్.. రంగంలోకి పోలీసులు..!

Raj Tarun – Lavanya: గడిచిన నాలుగైదు రోజుల నుంచి టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి పలు విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా మాజీ ప్రేయసి లావణ్య ను ప్రేమించి మోసం చేశారని.. వివాహం చేసుకోలేదని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఆమె విస్తుపోయే నిజాలను రోజుకొకటి బయట పెడుతూనే ఉంది.. ముఖ్యంగా చాలామంది హీరోయిన్లతో రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందనే విషయాలను కూడా తెలియజేసింది.. అంతేకాకుండా తనకు అబార్షన్ చేయించారనే విషయాన్ని కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరి అక్కడ కంప్లైంట్ చేయడమే కాకుండా అందుకు తగ్గట్టుగా ప్రూఫ్ లను కూడా చూపించిందట.

Raj Tarun - Lavanya: Lavanya's suicide note.. Police in the field..!
Raj Tarun – Lavanya: Lavanya’s suicide note.. Police in the field..!

రాజ్ తరుణ్ మరణిస్తే విధవను అవుతూ..

ఈ విషయాలు విన్న పలువురు ప్రేక్షకులు రాజ్ తరుణ్ పైన కాస్త కోపంగానే ఉన్నారు.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని కూడా.. లేదనే విధంగా ఆరోపణలు చేయడంతో పాటు డబ్బు కోసమే తనని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉందని చెప్పడమే కాదు ఆమె మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది అలాగే డ్రగ్స్ కూడా తీసుకుంటుంది అనే విధంగా ఆరోపణలు చేయడంతో ఆమె మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.. రాజ్ తరుణ్ ను మాత్రం వదిలేదే లేదని .. రాజ్ తరుణ్ చస్తే విదవనవుతాను తప్ప.. తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఒక శబదం చేసింది లావణ్య.

సూసైడ్ నోట్ రాసిన లావణ్య..

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య అర్ధరాత్రి పోలీసులకు మీడియాకు ఒక సూసైడ్ నోట్ పంపడం కలకలాన్ని రేపింది. దీంతో ఒక్కసారిగా నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మరి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడినట్లుగా సమాచారం.. తను ఎంతగానో ప్రేమించిన రాజ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని.. కానీ అతను పూర్తిగా మారిపోయాడు.. నా చావును మాత్రమే కోరుకుంటున్నాడు. దీని అంతటికి హీరోయిన్ మాల్వి మల్హోత్రానే కారణమంటూ సూసైడ్ లెటర్ రాసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లెటర్ లో రాసిపెట్టినట్లుగా సమాచారం.

- Advertisement -

మాల్వి మల్హోత్రాను హైలైట్ చేస్తూ..

రాజ్ తరుణ్ తో తనకు పదేళ్లకు పైగా రిలేషన్ ఉందని.. అతడు హీరో కాకముందే తనకు బాగా తెలుసు అని కూడా తెలిపింది లావణ్య.. అలాగే తనకోసం 70 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశానని కూడా తెలియజేసింది కానీ హీరోయిన్ మాల్వి మల్హోత్రాలతో పరిచయమయ్యాకే తాను చెడ్డదాన్ని అయిపోయాను అంటూ తెలిపింది. వారిద్దరి మధ్య ఎఫైర్ ఉంది.. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి.. వారిద్దరూ హోటల్ గదిలో ఎందుకు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు అంటూ పలు వాదనలను కూడా తెలియజేసింది. రాజ్ తరుణ్ విషయంలో నేను అబద్ధాలు చెప్పను అంటూ కూడా తెలియజేసింది లావణ్య. మరి ఇలాంటి విషయాలపైన హీరో రాజ్ తరుణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఏదేమైనా సూసైడ్ లెటర్ రాయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు