Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ కి నోటీసులు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరో..!

Raj Tarun – Lavanya : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్ర. రాజ్ తరుణ్ ప్రేయసి అయిన లావణ్య.. తనని రాజ్ తరుణ్ మోసం చేశారని.. ప్రేమ పేరుతో ఆడుకున్నాడని.. తనకు అబార్షన్ కూడా చేయించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ పేర్లన్నీ వైరల్ గా మారాయి. దీంతో విచారణకు హాజరు కావాలి అంటూ రాజ్ తరుణ్ కు పోలీసులు సైతం నోటీసులు జారీ చేశారు. ఈ రోజున (18 July) తమ ఎదుట హాజరు కావాలి అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా రాజ్ తరుణ్ తనకు వచ్చిన నోటీసులకు రిప్లే ఇచ్చారు. ఆ రిప్లేలో ఏం ఉందో ఇప్పుడు చూద్దాం.

Raj Tarun - Lavanya: Notices for Raj Tarun.. The hero who gave an unexpected twist..!
Raj Tarun – Lavanya: Notices for Raj Tarun.. The hero who gave an unexpected twist..!

రాజ్ తరుణ్ కి నోటీసులు..కానీ

నటుడు రాజ్ తరుణ్, నటి మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడిపై నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. పోలీసులు నోటీసులు జారీ చేయగా గురువారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఈ విషయం పెను సంచలనం సృష్టిస్తోంది.

హాజరు కాలేనని చెబుతున్న రాజ్ తరుణ్..

ఇక విచారణకు హాజరుకాలేనని.. నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు.. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని.. విచారణకు హాజరు కాలేనని. రాజ్ తరుణ్ తెలిపారు.. ఇకపోతే వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ ను విచారణ చేయాలనుకుంటున్న పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

మరో కేసులో మాల్వి..

హీరోయిన్ లావణ్య, మాల్వి మల్హోత్ర కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుండగా.. ఊహించని రీతిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా నిన్నటి వరకు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య అంటూ కేసు నడవగా ఇప్పుడు మాల్వి మల్హోత్రా గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూడడంతో.. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్ గా మారింది

ప్రొడ్యూసర్ తో ఎఫైర్.

మాల్వి మల్హోత్రా పై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేసిన విషయం కూడా వైరల్ గా మారుతుంది. మాల్వి బండారం యోగేష్ తల్లి బయటపెట్టింది.. యోగేష్ నీ ట్రాప్ చేసి ఆస్తి మొత్తం కాజేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో తమ కుమారుడి జీవితాన్ని మాల్వీ నాశనం చేసిందని.. తప్పుడు కేసుతో యోగేష్ ను జైలుకు పంపించిందంటూ కూడా ఆమె ఆరోపించింది.. నాలుగేళ్లుగా మాల్వి ఇబ్బంది పెడుతోందని ఆమె కంటతడి పెట్టుకుంది.

కత్తితో దాడి..

అయితే 2020లో ముంబైలో ఉన్నప్పుడు మాల్విపై యోగేష్ కత్తితో దాడి చేసిన ఘటన అందరికీ గుర్తుంది.. మాల్వి పెళ్ళికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో వార్తలు ఉంచారు.. అయితే మాల్వి – యోగేష్ కాల్ లిస్ట్ కూడా యోగేష్ తల్లి బయట పెట్టడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇక ఈ సంచలన ఆరోపణలపై ఇంతవరకు రాజ్ తరుణ్, మాల్వి ఎవరు స్పందించలేదు.. మొత్తానికైతే అటు మాల్వి .. ముంబై ప్రొడ్యూసర్ తో ఇటు రాజ్ తరుణ్ తో ఎఫైర్ కారణంగా వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు. మరి ఇలాంటి రూమర్స్ ఇంకెన్ని వినిపిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు