Raj Tarun – Malvi malhotra.. ప్రముఖ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య రోజుకొక ట్విస్ట్ బయటపెడుతూ.. రాజ్ తరుణ్ ఎలాంటివాడో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇతడు రహస్యంగా అక్రమ సంబంధం నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రూవ్ చేసింది కూడా. ముఖ్యంగా రాజ్ తరుణ్ – లావణ్య – మాల్వి మల్హోత్రాల మధ్య కేసుల వ్యవహారం తారాస్థాయికి చేరింది.తాజాగా రాజ్ తరుణ్ మల్హోత్రా మెసేజ్ చాట్ లీక్ అయింది.
ఇల్లీగల్ ఎఫైర్.. రాజ్ తరుణ్ – మాల్వి మెసేజ్ చాట్ లీక్.
2023లో రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రాకు లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుండి వచ్చిన ప్రపోసల్ కు ఆమె కూడా వెంటనే యాక్సెప్ట్ చేసినట్టు మెసేజ్ పెట్టింది.. అనేకసార్లు రాజ్ తరుణ్ కు మాల్వీ హోటల్స్ కూడా బుక్ చేసింది.. ప్రతిసారి కూడా కోయంబత్తూర్ లోని మాధవ హోటల్లో వీరిద్దరూ కలిసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయట. పైగా రెగ్యులర్గా వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకునేవారని..అందులో రోజూ వారీ ప్లానింగ్, ట్రిప్స్ తదితర విషయాలపై ప్రతిదీ కూడా వీరిద్దరూ షేర్ చేసుకునే వారని సమాచారం.. అంతేకాదు మాల్వి మల్హోత్రా పర్సనల్ విషయాలపై కూడా రాజ్ తరుణ్ చాటింగ్ లోనే ప్రస్తావించేవాడని సమాచారం.. అంతేకాదు ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ చాట్ లీక్ కావడంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమని తెలుస్తోంది..
లావణ్య చెప్పింది నిజమే…
గత కొన్ని రోజుల క్రితం లావణ్య.. రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రతో ఇల్లీగల్ రిలేషన్ నడుపుతున్నాడు అంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ ముగ్గురి పై కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. 18వ తేదీలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.. కానీ రాజ్ తరుణ్ చిత్రాల షూటింగ్స్ , బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని తన లాయర్ ద్వారా సమాచారాన్ని చేరవేశాడు. అంతే కాదు విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని ఒక లేఖలో రాసి పోలీసులను కోరినట్లు తెలిసింది. ఇక ఇప్పుడు ఏకంగా వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ ఎఫైర్ నిజమని మెసేజ్ చాట్ లీక్ అవడంతో ఇక లావణ్య చెప్పిందంతా నిజమేనని స్పష్టం అవుతుంది. మొత్తానికి అయితే రహస్యంగా అక్రమ సంబంధం పెట్టుకున్న రాజ్ తరుణ్.. ఆమెతో చేసిన రొమాంటిక్ మెసేజ్ చాటింగ్ కూడా బయటపడేసరికి రాజ్ తరుణ్ వ్యక్తిత్వం పై అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
అక్రమ సంబంధం పై స్పందిస్తారా..
రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య.. రాజ్ తరుణ్ మోసాలను బయటపెట్టింది.. గత 11 సంవత్సరాలుగా తనతో ప్రేమాయణం నడిపిన ఇతడు, పెళ్లి చేసుకొని రహస్యంగా రెండుసార్లు అబార్షన్ చేయించి, ఇప్పుడు మాల్వి మల్హోత్రాపై ప్రేమతో తనను దూరం పెడుతున్నాడని ., ఎలాగైనా సరే తనకు రాజ్ తరుణ్ కావాలి అని పోలీసులను ఆశ్రయించింది. అలాగే మాల్వి మల్హోత్రా, తన సోదరుడితో కలిసి చంపేస్తానని బెదిరిస్తోందంటూ కూడా చెప్పింది.. దీనిపై రియాక్ట్ అయిన మాల్వి అసలు రాజ్ తరుణ్ తో తనకు పరిచయం తక్కువ అని , కావాలని తనను ఇందులోకి లాగుతున్నారని, లావణ్య పై కేసు పెట్టాలని కూడా కామెంట్ చేసింది. కానీ ఇప్పుడు లావణ్య ఒక్కొక్కటిగా ఆధారాలు బయట పెట్టేసరికి ఇక వీరంతా ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఉత్కంఠగా మారింది .మరి ఈ విషయాలపై మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.