Raj Tarun.. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ – లావణ్య వివాదం రోజుకొక ట్విస్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా రాజ్ తరుణ్ ఇన్ని రోజులు మంచివాడని అందరూ అనుకున్నారు. అయితే ఈయనపై అనూహ్యంగా ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ రాజ్ తరుణ్ లైఫ్ లో ఇదొక మాయని మచ్చగా నిలిచిపోయిందని చెప్పడంలో సందేహం లేదు.
నెగిటివిటీ తో కృంగిపోతున్న రాజ్ తరుణ్..
ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ గురించి ఒక్కొక్క విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి తోడు ఇటీవల ఈయన నటించిన పురుషోత్తముడు, తిరగబడరాసామి రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి దీంతో ఆయనను ఈ విషయాలు కూడా మరింత కృంగదీసాయని చెప్పవచ్చు. ఒకవైపు ఆయన గురించి లావణ్య పలు రకాల ఆరోపణలు చేస్తూ అందరిలో నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేస్తుండగా మరొకవైపు ఆయన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుంటే అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు.
రాజ్ తరుణ్ మోసం చేయాలనుకున్న వ్యక్తి..
ఈ క్రమంలోనే గతంలో ఆయన దగ్గర నుండి డబ్బులు కొట్టేయాలని ఒక వ్యక్తి చూశారట. మరి ఆయన ఎవరు? అసలు ఏం జరిగింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలనుకున్న రాజ్ తరుణ్ మొదటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈయన హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకొని, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో విజయం సాధించి ఏకంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకొని రికార్డ్ సృష్టించారు అయితే ఆ తర్వాత సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, రంగులరాట్నం, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఒరేయ్ బుజ్జిగా, లవర్, అనుభవించు రాజా ఇలా వరుస చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనికి తోడు ఇటీవల వచ్చిన పురుషోత్తముడు, తిరగబడరాసామి సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలవడం ఆయన కెరియర్ పతనానికి కారణం అని చెప్పాలి.
కోట్ల రూపాయలు నష్టపోకుండా కాపాడిన రాజా రవీంద్ర..
ఇలాంటి సమయంలో గతంలో రాజ్ తరుణ్ దగ్గర మేనేజర్ గా పనిచేసిన నటుడు రాజా రవీంద్ర, రాజ్ తరుణ్ కి సంబంధించిన సినిమా విషయాలు అన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవారట. అంతేకాకుండా రాజ్ తరుణ్ చేసిన ప్రతి సినిమాలో కూడా రాజా రవీంద్ర ఉండేవారు. అయితే అలాంటి రాజా రవీంద్ర ఒకసారి రాజ్ తరుణ్ మోసపోకుండా కాపాడారట. ఒక వ్యక్తి రాజ్ తరుణ్ ను మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టేయాలని చూసారట. వెంటనే ఈ విషయం గ్రహించిన రాజా రవీంద్ర వెంటనే ఆ వ్యక్తిపై కేసు పెట్టడంతో అనర్ధం జరక్కుండా ఆగిందని సమాచారం. లేకపోతే ఆ వ్యక్తి వల్ల రాజు తరుణ్ కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయే వారని సమాచారం. అయితే ఈ విషయాలను రాజా రవీంద్ర బయట పెట్టారు. కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం ఆయన చెప్పలేదు.