Rajamouli: రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం.. ఏమిటంటే..?

Rajamouli.. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్లలో రాజమౌళిది మొదటి స్థానం ఉంటుంది.. RRR చిత్రంతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమని తీసుకువెళ్లారు.. అసలు ఆస్కార్ వేదిక పైకి తెలుగు సినిమాలు వెళ్తాయా.. అనుకునే వారికి ఏకంగా ఆస్కార్ వేదిక పైన అవార్డును సైతం అందుకునేలా చేశారు రాజమౌళి. కీరవాణి , చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకోవడంతో తెలుగు పరిశ్రమకు ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. RRR సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ గురించి.. హాలీవుడ్ లో కూడా మాట్లాడుకునే విధంగా చేశారు రాజమౌళి.

రాజమౌళి దంపతులకు అరుదైన ఆహ్వానం..

Rajamouli: A rare honor for the Rajamouli couple.. What..?
Rajamouli: A rare honor for the Rajamouli couple.. What..?

రాజమౌళి డైరెక్షన్ ని , నటులను హాలీవుడ్ యాక్టర్స్ కలిసి ప్రశంసించడం కూడా జరిగింది. తాజాగా రాజమౌళి మరొకసారి ఆస్కార్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సేస్ లో చేరమంటూ రాజమౌళికి ఆస్కార్ నుంచి ఒక ఆహ్వానం కూడా అందినట్లు తెలుస్తోంది.. గత ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రామ్ చరణ్ , చంద్రబోస్ తదితర సెలబ్రిటీలకు సైతం ఆహ్వానం అందినప్పటికీ ఈసారి రాజమౌళి దంపతులతో పాటు.. షబానా అజ్మీ, రవివర్మ, రితేష్ సిద్వానీ తో పాటు బాలీవుడ్ ప్రముఖులకు సైతం ఆహ్వానం అందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

57 దేశాల నుంచి 487 మందికి ఆహ్వానం..

దాదాపుగా 57 దేశాల నుంచి సుమారుగా 487 మందికి కొత్తవారికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఆస్కార్ అకాడమీలో భాగమైనటువంటి వారందరూ కూడా ఆస్కార్ సినిమాలకు ఓటు వేసే అవకాశం ఉంటుందట.. అలాగే స్పెషల్ స్క్రీనింగ్ పలు వర్క్ షాప్స్ సెమినార్స్ వంటి వాటికి కూడా వెళ్లవచ్చు అన్నట్లుగా తెలుస్తోంది. అకాడమీలో జరిగేటువంటి ఈ ఈవెంట్స్ కి కూడా వీరు వెళ్ళవచ్చు. వీటితోపాటు సినిమాలకు సంబంధించిన ఏవైనా సలహాలు, సూచనలు సైతం తీసుకోవచ్చు ఇవ్వవచ్చు కూడా.. అయితే ఈ విషయం తెలిసిన అటు రాజమౌళి.. అభిమానులు సైతం రాజమౌళి దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు.

- Advertisement -

SSMB -29..

ప్రస్తుతం రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు తో కలిసి SSMB -29 చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం కూడా మహేష్ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా లాంచింగ్ తేదీ పైన కూడా పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ రాజమౌళి ఈ సినిమా పైన ఎటువంటి అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాకు సంబంధించి కసరత్తులు చేస్తూ ఉన్నారు. రాజమౌళి కూడా పలు రకాల లోకేషన్లను కూడా తిరిగేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా కథ చాలా అద్భుతంగా రూపొందించినట్లు సమాచారం. మరి ఇప్పటివరకు తెలుగు సినిమా తప్ప మరో ఇతర భాషా చిత్రాలలో నటించడానికి మొగ్గు చూపని మహేష్ బాబు ఈ సారి ఏకంగా పాన్ వరల్డ్ చిత్రంతో ఆకట్టుకోబోతున్నారు. మరి రాజమౌళి అడుగులు వేస్తున్నారు కాబట్టి కనీసం ఇప్పటికైనా ఆస్కార్ లభిస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు