Rajamouli : జక్కన్న తన లైఫ్ లో చేసింది ఒకే ఒక్క రీమేక్… ఆ మూవీ ఏంటో తెలుసా?

Rajamouli : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రేంజ్ ని మార్చిన దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా అపజయం అన్నదే ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఓ రీమేక్ సినిమాను కూడా చేశారన్న సంగతి తెలుసా ? మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

ఒకే ఒక్క రీమేక్.. అది కూడా హిట్టే

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సినిమాలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో జక్కన్న పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్స్ లో సందడి చేసిన తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. హాలీవుడ్‌లో కూడా ఆయన పాపులర్ అయ్యారు. సౌత్ లాగే ఇప్పుడు బాలీవుడ్ లోనూ రాజమౌళి జపం జోరుగా సాగుతోంది. ఇక దీనంతటి కంటే ముందే టాలీవుడ్‌లో వరుస హిట్ సినిమాలను అందించాడు.

కొన్నాళ్లుగా నెక్స్ట్ తాను మహష్ బాబుతో చేయబోయే సినిమా కోసం తన సొంత కథపై కసరత్తు చేస్తున్నారు రాజమౌళి. అయితే సినిమాల విషయంలో చాలా క్రమశిక్షణగా ఉండే జక్కన్న ఆయన కెరీర్లో ఒకే ఒక్క సినిమాను రీమేక్ చేశారట. అదే మర్యాద రామన్న మూవీ. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన చిత్రం మర్యాద రామన్న సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Prime Video: Maryada Ramanna

ఈ హాలీవుడ్ మూవీ నుంచే రీమేక్

మర్యాద రామన్న సినిమా వందేళ్ల క్రితం నాటి సినిమా ‘అవర్ హాస్పిటాలిటీ’కి రీమేక్. ఈ హాలీవుడ్ సినిమా ద్వారా మర్యాద రామన్న కథ పుట్టింది. సినిమాలో సొంత ఊరికి దూరంగా ఉంటున్న కథానాయకుడు తనకు అక్కడ ఆస్తి ఉందని తెలుసుకుని తిరిగి ఊరికి వెళతాడు. ఈ ప్రయాణంలో హీరోయిన్ తారసపడుతుంది. విలన్ నే ఇంటికి దారి అడిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. హీరో ఇల్లు దాటితే శత్రువులు చంపేస్తారు.

మర్యాద రామన్న సినిమా మొత్తం హాలీవుడ్ సినిమా హాస్పిటాలిటీ తరహాలోనే ఉంటుంది. ఎస్ఎస్ కంచి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. కంచి రాజమౌళి బంధువు. సినిమాలో రైలు సన్నివేశంలో కామెడీ పాత్రలో కనిపించాడు. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన మర్యాద రామన్న ఫైనల్ రన్ లో రూ.40 కోట్లు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలను అందించింది. అయితే ఆ సినిమాలో నటించిన వారెవరూ ఇప్పుడు బ్రతికి లేరు.

ఇదిలా ఉండగా రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం యావత్ దేశ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కంప్లీట్ యాక్షన్ సినిమా అని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా నటిస్తారని వార్తలు వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు