Rajendra Prasad: ఆయనను మానసిక క్షోభకు గురిచేసారు, రామోజీ రావు ఆ గెలుపును చూసి వెళ్లారు

Rajendra Prasad: ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు కొద్దిసేపటికి మరణించిన విషయం తెలిసిందే. చాలామంది సినిమా ప్రముఖులు ఈ విషయంపై నివాళులర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినిమా ప్రముఖులు తమ సంఘీభావాన్ని తెలిపారు. కేవలం సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..

అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వలన చివరికి మానసిక క్షోభను అనుభవించి వెళ్లారు. భగవంతుడు ఈ విషయాన్ని చూసుకున్నాడు. నిజమైన గెలుపుని ఆయన అనుభవించి చనిపోయారు. ఆ సక్సెస్ ను ఆయన చూసే వెళ్లారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బ్రతుకున్నంత వరకు కొంతమంది బ్రతుకుతారు వారిలో రామోజీరావు కూడా ఒకరు అని చెప్పుకొచ్చారు.

Ramoji Rao

- Advertisement -

ఇకపోతే ఈ మాటలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు చాలామంది వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. ఒకవైపు చంద్రబాబు తో పాటు మరోవైపు రామోజీరావును కూడా వ్యక్తిగతంగా విమర్శించారు. అయితే కేసులు కూడా పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అవి పెద్దగా ఫలించలేదు. ఇకపోతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీపై భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి, రామోజీరావు కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే వారందరికీ సమాధానమే ఈ గెలుపు అనే విధంగా రాజేంద్రప్రసాద్ ఈ మాటలు మాట్లాడారు అని చాలామందికి ఈజీగా అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు