Rajisha Vijayan: పెళ్లికి సిద్ధమైన జై భీమ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Rajisha Vijayan.. 2022 లో కీడం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన జై భీమ్ హీరోయిన్ రజీషా విజయన్ ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. అంతేకాదు ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కీచురాళ్ళు అనే పేరుతో డబ్ చేసి ఈటీవీ విని యాప్ లో స్ట్రీమింగ్ కి వదిలారు.. ఇక్కడ కూడా తెలుగు ఆడియన్స్ ను విపరీతంగానే ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.. దీంతో ఈమె పేరు బాగా వార్తల్లో నిలిచింది. ఇందులో భాగంగానే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే రజీషా విజయన్ పెళ్లి పీటలెక్కబోతోందని వార్తలు తెరపైకి వచ్చాయి..

సినిమాటోగ్రాఫర్ టోవిన్ థామస్ తో పెళ్లికి సిద్ధం..

Rajisha Vijayan: Jai Bheem beauty ready for marriage.. Who is the groom..?
Rajisha Vijayan: Jai Bheem beauty ready for marriage.. Who is the groom..?

ఈమధ్య కాలంలో హీరోయిన్లు, హీరోలు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రజీషా విజయన్ కూడా వివాహం చేసుకోబోతుందని సమాచారం.. తెలుగమ్మాయిలా కనిపించే ఈమె తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ముందు నుంచి కూడా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ వీరిద్దరూ జంటగా దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగా… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.. ముఖ్యంగా ఇటీవల టోబిన్ థామస్ షేర్ చేసిన ఇన్ స్టా పోస్టు చూస్తే మాత్రం నిజంగానే వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతుంది అంటూ చెబుతున్నారు నెటిజన్స్.. మరి టోబిన్ థామస్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధమైన రజీషా విజయన్ ఎప్పుడు వివాహం చేసుకుంటారు అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రజీషా విజయన్ సినిమాలు..

ఈ ముద్దుగుమ్మ తమిళంలో కర్ణన్, జై భీమ్ సర్దార్ వంటి చిత్రాలలో నటించి అభిమానుల దృష్టిని ఆకర్షించింది.. మొదట తమిళ సినిమా కర్ణన్ 2021లో విడుదలైంది.. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న ఈమె.. తమిళ సినిమాల్లోకి రాకముందు మలయాళం లో కొన్ని సినిమాలు , సీరియల్స్ కూడా చేసింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో ఈమెకు అవకాశాలు రాలేదు.. దీంతో తమిళ్ , మలయాళం లో చేసిన సినిమాలను డబ్ చేస్తూ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వివాహం చేసుకుంటే వివాహం తర్వాత సినిమాలకు దూరం అవుతుందా? లేక ఎప్పటిలాగే తన కెరీర్ ను వివాహం అనంతరం కూడా కొనసాగిస్తుందా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.. ఏది ఏమైనా రజీషా విజయన్ పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు