Rakul Preet Singh : రకుల్ పరిస్థితేంటి ఇంత దారుణం… వేణు స్వామి అప్పుడే చెప్పాడు..!

Rakul Preet Singh.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీల జీవితాలలో తలదూరుస్తూ.. వారి వైవాహిక బంధాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ల , పెళ్లిళ్ల విషయంలో ఈయన చేస్తున్న కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు చెప్పినది.. చెప్పినట్టే జరుగుతూ ఉండడం ఆశ్చర్యకరం.. అయితే ఒక్కొక్కసారి ఈయన చెప్పే జోష్యం నిజం కాదు.. అందుకే ఇలాంటి విషయాలలో ట్రోల్ అవుతూ ఉంటారు.. రాజకీయాలలో, ప్రభాస్ జీవితంలో ఈయన చెప్పిన జోస్యం ఏది ఫలించలేదు.. అందుకే ప్రభాస్ అభిమానులు ఈయనపై ఎప్పుడు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు..

Rakul Preet Singh : Rakul's situation is so bad... Venu Swami just said..!
Rakul Preet Singh : Rakul’s situation is so bad… Venu Swami just said..!

రకుల్ వైవాహిక జీవితం పై వేణు స్వామి కామెంట్లు..

ఇదిలా ఉండగా గతంలో రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక జీవితం పై వేణు స్వామి చేసిన కామెంట్లు.. ప్రస్తుతం ఆమె వివాహం తర్వాత జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయన చెప్పింది నిజమే అని చెప్పక తప్పడం లేదు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుంటే వివాహం తర్వాత అంతగా కలిసి రాదని ఆమె సమస్యలు ఎదుర్కొంటుందని వేణు స్వామి చెప్పారు..

వేణు స్వామి చెప్పినట్టే జరిగిందా..

ఇప్పుడు రకుల్ వైవాహిక జీవితం అచ్చం ఆయన చెప్పినట్టే సాగుతోంది.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ అనే వ్యక్తిని ఈమె ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట ఫిబ్రవరి 21 ఈ ఏడాదే వివాహం చేసుకొని ఒకటయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత అంతా సవ్యంగానే సాగుతోంది అనుకున్నారు.. కానీ అనూహ్యంగా జాకీ భగ్నానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

- Advertisement -

వివాహం తర్వాత కష్టాల్లో రకుల్..

అసలు విషయంలోకి వెళ్తే.. రకుల్ ప్రీత్ సింగ్ భర్త ప్రముఖ నటుడు బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీ పూజా ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థను కొనసాగిస్తున్నారు.. దీని ద్వారా కొన్ని సినిమాలు కూడా తెరకెక్కించారు.. ఈ సంస్థ నుంచి ఇటీవలే బడే మియా చోటే మియా సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో జాకీ భగ్నాని పూర్తిస్థాయిలో నష్టాల్లో మునిగిపోయారు.. దీంతో రెండు నెలల జీతాన్ని గత రెండు సంవత్సరాలుగా ఇవ్వలేదు అని.. పూజా నిర్మాణ సంస్థపై అందులో పని చేసే ఉద్యోగులు పోస్ట్లు పెట్టడంతో ఇండస్ట్రీలో ఈ వార్త కాస్త సంచలనంగా మారింది. ఏకంగా రూ.250 కోట్ల నష్టం వాటిల్లడం ఈ జంటకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు.

ఈ హీరోయిన్స్ విషయంలో వేణు స్వామి మాటలు నిజం..

ఇక ఆర్థిక సమస్యలు మొదలవడంతో ఈమెకు పెళ్లి కలిసి రాలేదని వేణు స్వామి చెప్పినట్లే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే గతంలో నయనతార, సమంత, అనుష్క లకు పెళ్లి జీవితం అచ్చి రాదని.. వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు .. అనుకున్నట్టుగానే సమంత , నయనతార వైవాహిక జీవితాల్లో కష్టాలు ఎదుర్కొన్నారు..అయితే అనుష్క ఇంకా వివాహానికి సిద్ధం కాలేదు.. ఇప్పుడు రకుల్ విషయంలో కూడా చెప్పినట్టే జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు