Ram Charan: తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో అమీ జాక్సన్ కూడా ఒకరు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ఎవడు సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. సంక్రాంతి కానుక రిలీజైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో అమీ జాక్సన్ కి మంచి పేర్లు లభించింది ఆ తర్వాత తెలుగులో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేసింది అమీ జాక్సన్.
కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ భాషల్లో కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. అమీ జాక్సన్ గతంలో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్ రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. ఐతే, ఆ తర్వాత అమీ-జార్జ్ మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ ప్రయాణం అలా ముగిసింది. అది కూడా బ్రేకప్ అయిపోయింది.
ఇప్పుడు హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.ఎట్టకేలకు అమీ జాక్సన్ తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు తమ వెడ్డింగ్ పిక్స్ ను అమీ జాక్సన్ పోస్ట్ చేస్తూ.. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అంటూ ఓ కాప్షన్ కూడా ఇచ్చింది. రామ్ చరణ్ మూవీ ‘ఎవడు’తో పాటు, ‘ఐ’, ‘2. ఓ’ తదితర చిత్రాలలో అమీ జాక్సన్ నటించి ఆకట్టుకుంది.