RC16 : రంగంలోకి దిగిన గ్లోబల్ స్టార్.. ఒక్క ట్వీట్ తోనే ప్రకంపనలు…

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందన్న సంగతి తెలిసిందే. చరణ్ కి సంబంధించి అన్ని సీన్లు కూడా పూర్తయిపోగా, ఆ సినిమాకి సంబంధించి చరణ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీ అయ్యాడని చెప్పొచ్చు. మహా అయితే ముందు ముందు ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ (Ram charan) తన తదుపరి సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అయ్యాడు. రామ్ చరణ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు (Buchibabu) తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ ప్రారంభోత్సవం కూడానాలుగు నెలల కిందటే గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఈపాటికే స్టార్ట్ కావాల్సి ఉండగా, గేమ్ ఛేంజర్ పనుల పెండింగ్ వల్లే ఆలస్యం చేసారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ అన్ని పనులు పూర్తి చేసుకోగా RC16 సెట్స్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు.

Ram Charan starrer RC16 movie update

RC16లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ట్వీట్..

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కొన్ని రోజుల నుండి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రిలాక్స్ మోడ్ లో ఉండగా, ఇప్పుడు ఫైనల్ గా RC16 స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. తాజాగా RC16 గురించి అప్డేట్ ఇస్తూ కాసేపటికిందే రామ్ చరణ్ ట్వీట్ వేసాడు. చరణ్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో “బీస్ట్ మోడ్ ఆన్” అంటూ బ్యాక్ స్టిల్ ఒకటి పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుంది. చరణ్ అభిమానులు ఇప్పటికైనా కొత్త సినిమా స్టార్ట్ చేసాడు చాలు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ లో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడని తెలుస్తూనే ఉంది. RC16 రగ్గడ్ గడ్డంతో ఊర మాస్ గా కనిపించనున్నట్టు సమాచారం. పోస్ట్ చేసిన బ్యాక్ స్టిల్ లోనే రామ్ చరణ్ ని గమనిస్తే.. లైట్ గా గడ్డం, హెయిర్ కూడా పెంచినట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఇదే నెలలో స్టార్ట్…

ఇక ఇటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (GameChanger) సెట్స్ లో బిజీగా ఉన్నా, బుచ్చిబాబు మాత్రం RC16 షూటింగ్ కి సంబంధించి అన్ని పనులు ముందే మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం చరణ్ ఇంటికి దగ్గర ఏరియాలో ఒక భారీ విలేజ్ సెట్ వేసారు. పైగా డైరెక్టర్ బుచ్చిబాబు అప్పుడే రహమాన్ (AR Rahaman) తో మ్యూజిక్ సిట్టింగ్ కూడా వేసాడు. టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో RC16 ఒకటి కాగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ మూడో వారం నుండి రెగ్యులర్ షూట్ మొదలు పెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యానర్ లో ఒక బయోపిక్ కథ ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు