Game Changer: ఏపీని అడ్డా చేసుకుంటున్నారు మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఏపీలో తెలుగు దేశం కూటమి అధికారంలోకి రాగానే… చరణ్ ఎక్కువగా ఏపీపై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దర్శకుడు శంకర్… ఈ సినిమాను చాలా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇందులో… నవీన్ చంద్ర అలాగే సునీల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న నేపథ్యంలో… ఆయన సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, కథ అలాగే దర్శకత్వం శంకర్ చేస్తుండగా నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా రాజమండ్రి కి రామ్ చరణ్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మెగా ఫాన్స్. దీనికి సంబంధించిన ఫోటోలు వేరేగా మారాయి. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్… రాజమండ్రిలో చేయాలని రామ్ చరణ్ పట్టుపట్టారట. దీంతో…. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను రాజమండ్రిలో చేయాలని డిసైడ్ అయ్యారట దర్శకుడు శంకర్. దీంతో తాజాగా రాజమండ్రికి గేమ్ చేంజర్ సినిమా బృందం వచ్చేసింది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్స్ రాజమండ్రిలోనే చేస్తున్నారు. ఇక పై ప్రతి సినిమాలోని కొన్ని సీన్స్ ఏపీలో ఉండేలా ప్లాన్ చేసుకోబోతున్నారట రామ్ చరణ్.