RC16 : సెట్స్ మీదకు రావడానికి చరణ్ మరింత ఆలస్యం.. కారణమేంటంటే?

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి సంబంధించి అన్ని సీన్లు కూడా పూర్తయిపోగా, చరణ్ లేని పది రోజుల షూట్ మాత్రమే బాకీ ఉందని సమాచారం. మహా అయితే చరణ్ మళ్ళీ గేమ్ ఛేంజర్ సెట్స్ కి వెళ్లినా రెండు మూడు రోజుల వర్క్ ఉండొచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి చరణ్ నెక్స్ట్ సినిమాపైనే ఉంది. తన తదుపరి సినిమాను బుచ్చిబాబు తో మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఆల్రెడీ మూవీ ప్రారంభోత్సవం కూడా మూడు నెలల కింద గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇక ఈ సినిమా షూటింగ్ ని జులై ఎండింగ్ లో స్టార్ట్ చేస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇకపోతే చరణ్ ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు చరణ్. పలు ఈవెంట్లలో సందడి చేస్తూ ఉండగా, తొందర్లోనే RC16 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడని వార్తలు రాగా, ఇప్పుడు చరణ్ ఎంట్రీ మరింత ఆలస్యం అవుతుందని తాజాగా సమాచారం వచ్చింది.

Ram Charan's RC16 movie will start shooting in September

చరణ్ పెద్ది ఆలస్యం… కారణం ఇదే!

ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందబోయే సినిమాకు పెద్ది అని టైటిల్ కూడా అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే RC16 వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ సినిమా సెట్స్ పైకి జులై ఎండింగ్ లో వెళ్తుందని ఆగష్టు నుండి రెగ్యులర్ షూట్ నాన్ స్టాప్ గా జరగనుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనికి కారణం కూడా చరణేనట. మ్యాటరేంటంటే… రామ్ చరణ్ ఈ సినిమాలో గుబురు గడ్డంతో డిఫరెంట్ మేకోవర్ తో కనిపించనున్నాడని సమాచారం. అందుకని చరణ్ ప్రస్తుతం గడ్డం, మీసం పెంచే పనిలో వున్నారట. బుచ్చి అనుకున్న గెటప్ వస్తే సెప్టెంబర్ లోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారట.

- Advertisement -

అన్ని పనులు మొదలెట్టిన బుచ్చి…

ఇక RC16 ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు మాత్రం చాలా రోజుల నుండే షూటింగ్ కి సంబంధించిన పనులు మొదలు పెట్టాడు. ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ ఇంటికి దగ్గరి ఏరియా లోని ఒక భారీ విలేజ్ సెట్ ను కూడా వేసారు. ఇక RC16 కి ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా కోసం డైరెక్టర్ బుచ్చిబాబు అప్పుడే రహమాన్ తో మ్యూజిక్ సిట్టింగ్ వేసాడు. అలాగే తనతో పాటు రత్నవేలు సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు