Ram Gopal Varma :ఒకప్పుడు సంచలన దర్శకులు అంటే రామ్ గోపాల్ వర్మ పేరు మొదటి వినిపించేది. శివ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఎన్నో హిట్ సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా తెలుగు డైరెక్టర్ సత్తా ఏంటో మొట్టమొదటి చూపించాడు. అప్పట్లో రాంగోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమా కూడా ఒక సంచలనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు ఒకప్పుడు రాంగోపాల్ వర్మను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లే.
చాలా తక్కువ ఏజ్ లోనే ఎక్కువ పుస్తకాలు చదివి మంచి జ్ఞానాన్ని సంపాదించాడు. అలానే అందరికీ కూడా లాజిక్ తో సమాధానం చెప్పడం రాంగోపాల్ వర్మ కి అలవాటు. అందుకనే వర్మ చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్లు వర్మ గెలుస్తూ ఉంటాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రాంగోపాల్ వర్మ మంచి సినిమా తీసి చాలా ఏళ్లయింది. రక్త చరిత్ర సినిమా తర్వాత ఇప్పటివరకు మళ్లీ రాంగోపాల్ వర్మ ఒక జెన్యూన్ అటెంప్ట్ కూడా చేయలేదు. ప్రస్తుతం కేవలం డబ్బులు కోసమే సినిమాలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. రీసెంట్ గా కొత్త టాలెంట్ కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించి టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఈ సినిమా పైన పలువురు సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒక పాత్రలో కనిపించారు. ఇక తాజాగా నిర్మాతలపై ఒక సంచలన ట్వీట్ ను పోస్ట్ చేశాడు రాంగోపాల్ వర్మ.’నాగ్ అశ్విన్ పై ఎంతో విశ్వాసం ఉంచినందుకు అశ్వనీదత్, స్వప్నదత్లకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వస్తోన్న డబ్బును నిల్వ చేయడానికి తండ్రీకూతుళ్లు ఓ లోతైన బావిని తవ్వాల్సి వస్తుంది’ అని ట్వీట్ చేశారు.
KUDOS to @AshwiniDuttCh and @SwapnaDuttCh for taking a GIANT LEAP OF FAITH on @nagashwin7 .. Both father and daughter will need to dig a deep well to store the money they are collecting , and will collect from PART 2 of #Kalki2898
— Ram Gopal Varma (@RGVzoomin) July 1, 2024