Rani Mukerji : బాలీవుడ్ లో 90స్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ రాణి ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన ఈమె, డిఫెరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇక లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు రాణీ ముఖర్జీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అమ్మడు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సోలో కథానాయికగా ఎదుగుతోంది. గతేడాది మార్చిలో రిలీజ్ అయిన `ఛటర్జీ వర్సెన్ నార్వే` చిత్రంతో మంచి విజయం అందుకుంది. అయితే ఇంతవరకూ మళ్లీ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. సరైన కథలు కుదరకపోవడంతో ఏడాది పాటు విరామంలో ఉంది. ఈ గ్యాప్ లో ఎన్నో కథలు కూడా వింది. కానీ ఏ కథా నచ్చకపోవడంతో సినిమాలు చేయలేదు. అయితే ఫైనల్ గా రెండేళ్ల పాటు తనతో పాటు జర్నీ చేసిన షోనాలీ బోస్ తో కొత్త చిత్రం చేయడానికి రెడీ అవుతుంది.
రెండేళ్ల గ్యాప్ కి సినిమా?
ఇక షోనాలి బోస్ తన తాను సినిమా చేస్తున్న విషయాన్ని రాణీ ముఖర్జీ అధికారంగా ప్రకటించింది. గత రెండేళ్లగా షోనాలీ తో రాణీ ముఖర్జీ (Rani Mukerji) స్టోరీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తుదిగా ఇద్దరి మధ్య తాజాగా కథా చర్చలు ముగిసాయి. ఇదొక ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన స్టోరీగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అవుతున్నాయి. ఇక గతంలో డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో తనదైన మార్క్ వేసింది. `మర్దానీ` లాంటి సినిమా రాణి ముఖర్జీకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే ఆ సినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ కొన్నాళ్ల గ్యాప్ అనంతరం ఎమోషన్ కంటెంట్ ని ఎంపిక చేసుకోవడం అమ్మడికి కెరీర్ ప్లస్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా, ఇవన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమా ప్రారంభించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
రాణి ముఖర్జీ మార్కెట్ తగ్గిందా?
ఇక రాణి ముఖర్జీ నటించబోయే ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తుంది. అతి త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. అయితే ఏడాది కాలంగా ఎలాంటి సినిమాలు చేయకుండా రాణీ ముఖర్జీ కథలపైనే ఇంతగా ఫోకస్ చేయడం పై చిన్నపాటి విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. సక్సెస్ ల్లో ఉన్నా నెమ్మదిగా సినిమాలు చేయడం, కమర్శియల్ చిత్రాలకు దూరంగా ఉండటం మార్కెట్ పై ప్రభావాన్ని చూపిస్తాయన్న విమర్శలు ఇటీవల మొదలయ్యాయి. ఎందుకంటే ఒకే రకంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తే అంతగా ఆదరించరు జనాలు అని బాలీవుడ్ వర్గాల అభిప్రాయం. అప్పుడప్పుడూ కమర్షియల్ చిత్రాలు కూడా చేయాలనీ నేటి మార్కెట్ సూత్రం చెప్తుంది. మరి వీటికి రాణీ ఎలాంటి ముగింపు ఇస్తుంది? అన్నది చూడాలి. ఇక త్వరలోనే రాణీముఖర్జీ సౌత్ లో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.