Rao Ramesh : గొప్ప మనసు చాటుకున్న విలన్… ఏపీ ప్రభుత్వానికి భారీ విరాళం

Rao Ramesh : టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సీనియర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రావు రమేష్ తాజాగా ఏపీ ప్రభుత్వానికి భారీ విరాళం ఇచ్చారు. ఉండి నియోజకవర్గంలో కొత్తగా ఎమ్మెల్యేగా ఎంపికైన రఘురామ కృష్ణం రాజుకు ఈ మేరకు రావు రమేష్ చెక్కును అందించారు. మరి ఇంతకీ రావు రమేష్ దేనికోసం ఎంత విరాళం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.

రావు రమేష్ భారీ విరాళం…

ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు తీర్చడానికి, నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజుకు ప్రముఖ నటుడు రావు రమేష్ మూడు లక్షల చెక్కును అందించారు. మొన్నటి వరకు వైసిపిలో ఉన్న రఘురామ ఎన్నికల ముందు టిడిపిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టిడిపి తరఫు నుంచి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు రఘురామ. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే అయిన రఘురామ కృష్ణంరాజుకు నటుడు రావు రమేష్ మూడు లక్షల విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి పగ్గాలు చేపట్టడంతో సినిమా ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు రావు రమేష్ విరాళం ఇవ్వడం కూడా ఈ సంతోషంలో భాగమేనని అంటున్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా రఘురామ కృష్ణంరాజుకు విరాళం ఇవ్వడంతో త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో రావు రమేష్ ఉన్నాడా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Geetha Arts pays a bomb for Rao Ramesh

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మోస్ట్ వాంటెడ్ యాక్టర్

తెలుగు సినిమా చరిత్రలో స్థానం దక్కించుకున్న దిగ్గజ నటుల్లో ఒకరైన రావు గోపాలరావు కొడుకుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు రావు రమేష్. అయితే ఆయన మంచి నటుడిగా మారడానికి వారసత్వం ఒక్కటే సరిపోలేదు. సినిమా ఇండస్ట్రీలో అప్పటికే ఎంతో పోటీ ఉండగా రావు రమేష్ తనదైన శైలిలో మాట్లాడుతూ, హవభావాలను పలికిస్తూ, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. చిన్న చిన్న పాత్ర దగ్గర నుంచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం రావు రమేష్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల దాకా విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు రావు రమేష్.

హీరోగానూ ప్రయోగాలు…

ఇక ఇప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన రావు రమేష్ రీసెంట్ గా హీరోగా మారారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాతో రావు రమేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు లక్ష్మణ్ కార్యా దర్శకత్వం వహించగా రావు రమేష్ సరసన ఇంద్రజ హీరోయిన్ గా నటించారు. పిబిఆర్ సినిమాస్, లోకమాత్ర సినిమాటిక్ సంస్థలపై ఈ సినిమాను బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు పలు ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. మరి నెక్స్ట్ రావు రమేష్ రాజకీయాల్లోకి అడుగు పెడతారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు