Rashmika: కాంతార టీంకి మెసేజ్ చేశా

నేషనల్ క్రష్ రశ్మికా మందన్నా అంటే ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కర్నాటకు కు చెందిన ఈ భామ.. శాండిల్ వుడ్ లో కిర్రాక్ పార్టీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత మరో రెండు సినిమాలను కన్నడలోనే చేసింది. దీంతో తెలుగులో నాగ శౌర్యతో ఛలో అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో రష్మిక మందన్నా కెరీర్ మలుపు తిరిగింది. దీని తర్వాత వెంట వెంటనే గోత గోవిందం, దేవదాసు వంటి అవకాశాలు వచ్చాయి. దీనిలో గోత గోవిందంతో రెండో సక్సెస్ కొట్టింది.

దీంతో తన సొంత ఇండస్ట్రీ శాండిల్ వుడ్ ను వదిలి టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అప్పటి నుంచి రష్మిక పై కన్నడ సినిమా లవర్స్ ఆగ్రహంతో ఉంటున్నారు. ఇటీవల కన్నడ నుంచి కాంతార వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో కాంతార పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కన్నడిగల ఆగ్రహం మరింత పెరిగింది. రష్మికపై బ్యాన్ వేయాలని కన్నడ ప్రేక్షకులు డిమాండ్ చేశారు. శాండిల్ వుడ్ చిత్ర పరిశ్రమ కూడా బ్యాన్ వేసిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందించింది.

తనపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం విధించింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాను కాంతార సినిమా చూశానని, టీంకు కూడా మెసేజ్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఆ మెసేజ్ ను తాను బయట పెట్టలేనని చెప్పింది. అది పూర్తిగా తన వ్యక్తిగతమని, నా పర్సనల్ విషయాలను బయటపెట్టలేని అంటూ చెప్పుకొచ్చింది. కాగా కాంతార విషయంలో కొంత మంది అనవసరంగా ఏదో జరిగినట్టు క్రియేట్ చేస్తున్నారని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు