Raviteja: టైగర్ కి టైం వచ్చింది.. మరి ప్రమోషన్స్ పరిస్థితి ?

మాస్ మహారాజ రవితేజ ఈ మధ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. గతేడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ తో పాటు ధమాకాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ, ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని తర్వాత వెంటనే వచ్చిన రావణాసుర మాత్రం దారుణంగా నిరాశపరిచింది.

ఈ ఫ్లాప్ నుంచి బయటపడటానికి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రవితేజ రెడీగా ఉన్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ పై కూడా ప్రకటన చేశారు. మే 24న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమం గతేడాది ఏప్రిల్ 2న జరిగింది.

దీని తర్వాత ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేవు. మధ్యలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందా ? లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే, దాదాపు ఇదే స్టోరీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టువర్ట్ పురం దొంగ అనే టైటిల్ ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే చివరికి బెల్లంకొండ వెనక్కి తగ్గడంతో రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. ఈ చిత్రం దసరాకు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ భారీగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, రవితేజ గత చిత్రం రావణాసుర ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలిసిందే. దీని నుంచి బయట పడాలంటే, టైగర్ నాగేశ్వర్ రావు భారీ హిట్ కొట్టాల్సిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు