తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి దేశవ్యాప్తంగా తెలిసిందే. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి ప్రగ్యాజైస్వాల్ ఇచ్చిన ఛాలెంజ్ని నటి రెజీనా కెసాండ్రా స్వీకరించింది. తాను నటించిన శాకిని డాకిని సినిమా నిర్మాత సునీతతో కలిసి శిల్పరామం రాక్ పార్క్ ఆవరణలో ఇవాళ మొక్కలు నాటింది రెజీనా.
ప్రగ్యా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరిస్తూ.. తాము రెండు మొక్కలు నాటామని చెప్పింది. ఈ ఛాలెంజ్లో అందరూ భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందన్నారు రెజీనా. తమకు ఎంతో ఇష్టమైనటువంటి పారితాజం, వేప మొక్కలను నాటినట్లు వెల్లడించింది. ఒక చైన్ మాదిరిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతుందని ప్రతీ ఒక్కరు పాల్గొని రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ అందేవిధంగా మొక్కలు నాటాలని కోరింది. ఈ ఛాలెంజ్లో నివేదా థామస్ను రెజీనా కోరింది. కాళబైరవ, శ్రీసింహ కి సునిత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా పచ్చదనం పెరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటినా కాలుష్యాన్ని నివారించవచ్చని సునిత తెలిపారు. ముఖ్యంగా ఒక మొక్కను నాటడం ద్వారా ఎంతో మందికి జీవితాన్ని అందించిన వాళ్లమవుతామని అందరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. మరోవైపు రెజీనా, నివేదా థామస్ కలిసి నటించిన చిత్రం శాకిని డాకిని ఈనెల 16న విడుదల అవుతోంది.