Renu Desai :ఆద్య, అకీరా పరిస్థితి ఇదీ… పవన్ గెలుపు నేపథ్యంలో రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్

Renu Desai : ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఇటు జనసేన కార్యకర్తలతో పాటు అటు టిడిపి, బిజెపి నాయకులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కూడా ఏపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆనందం వెల్లివిరుస్తోంది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ లో దూసుకెల్లడంతో పాటు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచాడు. ఇక టిడిపి, జనసేన, బిజెపి కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ చేసిన స్పెషల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

వీర తిలకం దిద్ది ఆహ్వానించిన పవన్ భార్య

ప్రస్తుతం పవన్ గెలుపుతో హైదరాబాద్ లోని ఆయన నివాసం బయట అభిమానులు కార్యకర్తలు టపాసులు పేలుస్తూ సెలబ్రేషన్స్ షురూ చేశారు. అలాగే ఈ ఎలక్షన్స్ పోరులో గెలిచి వచ్చిన తన భర్త పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ వెల్కమ్ పలికారు. అన్నా లెజనోవా ఇండియన్ స్టైల్ లో ఆయనకు వీర తిలకం దిద్ది, హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలుపు పై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Pawan Kalyan's ex-wife Renu Desai captures rare moment of actor with kids. Viral now - India Today

- Advertisement -

రేణూ స్పెషల్ పోస్ట్

ఆ పోస్ట్ లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు పై స్పందించారు. అంతేకాదు తన కూతురు ఆద్య కొడుకు అకీరా నందన్ పరిస్థితి ఇది అంటూ ఆమె షేర్ చేసిన స్పెషల్ పోస్ట్ మెగా ఫాన్స్ ఆనందానికి అంతులేకుండా చేసింది. కూతురు ఆద్య టీ గ్లాస్ పట్టుకున్న వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రేణూ దేశాయ్ ఈ గెలుపుతో ఆద్యా అండ్ అఖీరా ఎంతో ఆనందంగా ఉన్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ విజయంతో లబ్ధి పొందుతారని తాను ఆశిస్తున్నాను అని రాస్కొచ్చింది. అయితే పోస్టులో ఆమె ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును మెన్షన్ చేయకపోవడం గమనార్హం.

రేణు దేశాయ్ సపోర్ట్

అంతేకాదు ఈ ఎన్నికల్లో రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు. ఆమె బిజెపికి తన సపోర్ట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చేతిపై కమలం గుర్తుకున్న టాటూను వేయించుకొని మరీ బీజేపీకి తన సపోర్ట్ ను తెలిపింది. ఏదైతేనేం మొత్తానికి కూటమి గెలవడంపై ఆమె ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సినీ ప్రముఖుల విషెస్

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తన అభ్యర్థి వంగా గీత పై 69 వేల 169 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయి ధరం తేజ లాంటి మెగా హీరోల నుంచి పలువురు సినీ ప్రముఖుల దాకా అందరి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు