Rishab Shetty: “కాంతారా” ఫేమ్ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో డైరెక్టర్ గా ఎన్నో సినిమాలను ఇండస్ట్రీకి అందించిన ఈయన కాంతారా సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా అభిమానులు సినిమాను మర్చిపోలేకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్ మూవీ రాబోతుంది. కాగా రిషబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసాడు ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈయన సినిమాలకు సంబందించిన విషయాలను , ఫ్యామిలి విషయాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసాడు. ఆ పోస్ట్ లో రిషబ్ తో పాటుగా విక్రమ్ కూడా ఉంటాడు. విక్రమ్ సర్ ఎప్పుడూ నాకు స్ఫూర్తి. 24 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ రోజు నా విగ్రహాన్ని కలుసుకోవడం నన్ను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా భావిస్తున్నాను. నాలాంటి నటీనటులను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను . మీరు నటిస్తున్న తంగలాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్న అని రిషబ్ ఆ పోస్ట్ ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్రెండ్ అవుతుంది.
విక్రమ్ నటించిన ‘తంగలాన్’ ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ జరగ్గా.. తాజాగా బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్ ను కలిసాడు. అప్పుడు దిగిన ఫొటోలే ఇవి. ఈ ఫోటోలను చూసిన రిషబ్ ఫ్యాన్స్ మీరిద్దరూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంటే చూడాలని ఉంది. మా కోరికను తీరుస్తారని భావిస్తున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమా చేస్తారేమో చూడాలి. ఇక రిషబ్ బెంగుళూరు కు వస్తున్న ప్రతి హీరోను కలుస్తారన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ను కలిసాడు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాంతారా 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత తెలుగులో ఒక సినిమా చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాతలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం.
View this post on Instagram