Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో మహిళ… సంచలన ఆడియో బయటపెట్టిన ఆర్జే శేఖర్

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య ల ప్రేమ వ్యవహారం కేసు రోజోరోజుకు ముదురుతోంది తప్ప కేసు ఓ కొలిక్కి రావడం లేదు. సోషల్ మీడియాలో ఈ విషయంపై రోజుకో వార్త వస్తుండగా, రాజ్ తరుణ్ సినిమాల కోసం సైలెంట్ అయిపోయాడు. అయితే కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, నెట్టింట మాత్రం తీగ లాగితే డొంక కదులుద్ది అన్నట్టు, కొత్త కొత్త లింకులు ఈ కేసులో వచ్చిపడుతున్నాయి. ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ స్నేహితుల్లో ఒకరైన శేఖర్ బాషా ఆర్జే కూడా లావణ్య కి సంబంధించి పలు విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ మధ్య మస్తాన్ రావు అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను తీసుకునేది శేఖర్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు అతనితో పరిచయం పెంచుకుని ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ చెప్పుకొచ్చాడు. తాజాగా శేఖర్ బాషా లావణ్య కేసులో మరో మహిళ గురించి
ప్రస్తావిస్తూ సంచలన ఆడియో బయటపెట్టాడు.

RJ Shekhar released the audio of another woman in Raj Tarun Lavanya case

లావణ్య కేసులో మరో మహిళ ఆడియో..

ఇకపోతే లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కే ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్ తరుణ్ తాజాగా లావణ్య కేసు గురించి మరోసారి ప్రస్తావించగా, ఇంటర్వ్యూలో లావణ్య తనకి ఫోన్ చేసి రాజ్ తరుణ్ కు నాకు మధ్యలో ఎందుకువచ్చావని అంటూ బూతులతో తిడుతూ బెదిరించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ కేసులా మరో అమ్మాయి వేధించి తనపై కేసు కూడా పెట్టిందని చెప్పుకొచ్చాడు. ఆ మహిళ పేరు ‘పడాల లక్ష్మి’ అని చెప్తూ, ఆ అమ్మాయి కాల్ రికార్డ్ ఆడియో ని బయటపెట్టాడు. అందులో ఎక్కువ శాతం మ్యూట్ చేశారు. ఎందుకంటే ఆ ఆడియోలో ఎక్కువగా బూతులే ఉన్నాయి. అలాగే చివర్లో లావణ్య రాజ్ తరుణ్ గురించి పచ్చి బూతులు మాట్లాడిన ఆడియో బయటపెట్టాడు. ఆ ఆడియో లో రాజ్ తరుణ్ గురించే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా అసభ్యంగా బూతులు మాట్లాడినట్టు ఆ ఆడియో ఉంది. కాని అది లావణ్య వాయిసే అయి ఉంటుందా అంటే క్లియర్ గా చెప్పలేం. ఏది ఏమైనా ఈ కేసు పెను సంచలనానికి దారి తీస్తుందని చెప్పాలి.

- Advertisement -

ఇంకెంతమంది బయటికి వస్తారో…

ఇక రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ తో మొదలైన ఈ కేసు దర్యాప్తులో, శేఖర్ తో పాటు, హీరోయిన్ మాల్వి, మస్తాన్ సాయి అనే వ్యక్తి , లాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుండగా, మస్తాన్ సాయి మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇక రాజ్ తరుణ్ కూడా ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. మరి ఈ కేసు తుదిదశకు ఎప్పుడు చేరుకుంటుందో ఏమో మరి. అన్నట్టు రాజ్ తరుణ్ తాజాగా నటించిన పురుషోత్తముడు సినిమా రిలీజ్ కాగా, సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు