Roja: నందమూరి హీరోను కలిసిన రోజా..కారణం ఇదే ?

Roja: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది రోజా. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్రనటిగా తన హవాను కొనసాగించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహ అనంతరం కూడా రోజా సినిమాల్లో నటించింది. అనంతరం రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసి ఎన్నో పోరాటాలు చేసింది.

2009లో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన…. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరింది. ఫైర్ బ్రాండ్ గా దూకుడుగా ఉండే ఆమెను జగన్ ఎంతగానో ప్రోత్సహించారు. అంతేకాకుండా ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలు చేయడంలో రోజా ఎప్పుడు ముందుంటుంది. 2014లో నగరి నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టింది రోజా. ఇక వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది.

2019 ఎన్నికల్లో మరోసారి రోజా విజయం సాధించగా…. వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా జగన్ నియమించారు. అనంతర కాలంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ఇక ఓటమి అనంతరం రోజా ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతున్నారు. బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు. కాగా…. తాజాగా రోజా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారట.

- Advertisement -

roja-is-making-a-re-entry-into-movies-scene-reverse-from-now-on

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి వైసీపీ పరిస్థితిల గురించి వివరించిందట. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రోజాను ఏ మాత్రం పట్టించుకోలేదని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. తనను రాజకీయాల్లోకి అస్సలు లాగొద్దని…. అసలు ఏపీ పరిస్థితుల గురించి తన దగ్గర ప్రస్తావన తీయకూడదని కోరారట జూనియర్ ఎన్టీఆర్. దీంతో కంగు తిన్న రోజా…. అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు