Sai Dharam Tej: కాబోయే భార్యకు 2 కండీషన్లు.. ఒప్పుకుంటే ఇక డుం డుం..!

Sai Dharam Tej.. మెగా కుటుంబంలో ఉండే యంగ్ హీరోలు అందరూ వివాహం చేసుకొని ఒక్కొక్కరుగా వైవాహిక జీవితం వైపు అడుగులు వేస్తుంటే, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం ఇంకా వివాహానికి సిద్ధం కాలేదని చెప్పాలి. అయితే ఈయన పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఈయన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు కూడా వినిపించేవి.. కానీ అందులో నిజం లేకపోయింది.. కానీ ఇప్పుడు మరొకసారి ఈయన కాబోయే భార్యకు కొన్ని కండీషన్లు పెట్టాడు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది మన అదేంటో ఇప్పుడు చూద్దాం.

Sai Dharam Tej: 2 conditions for future wife.
Sai Dharam Tej: 2 conditions for future wife.

తానింకా పెళ్లి కానీ ప్రసాద్ నే..

గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ హీరోయిన్ మెహరీన్ తో ఈయన వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ..అవేవీ నిజం కాదు అని స్పష్టం చేశారు. తాను సోలో బ్రతుకే సో బెటర్ అనేలా ఉన్నానని , ప్రస్తుతానికి పెళ్లి కాని ప్రసాద్ ని మాత్రమే , అప్పుడే పెళ్లి రూమర్లతో తనను బుక్ చేయవద్దు అంటూ నవ్వుతూ తెలిపారు.

కాబోయే వారికి 2 కండీషన్లు..

అంతేకాదు తనని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా యాంకర్ అడగగా.. దీనిపై సాయి ధరమ్ తేజస్ స్పందిస్తూ.. రెండు కండీషన్లు పెట్టారు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి రెండు విషయాలు కచ్చితంగా పాటించాలి.. ఒకటి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి, మరొకటి మా అమ్మకు నచ్చాలి.. ఈ రెండు విషయాల్లో అమ్మాయి పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ తెలిపారు సాయిధరమ్ తేజ్.. అయితే అది ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా లేక బయటి అమ్మాయా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

రూ.100 కోట్ల బడ్జెట్ తో మూవీ..

ఇకపోతే తాజా సాయి ధరంతేజ్ డైరెక్టర్ విజయభాస్కర్ రూపొందించిన ఉషా పరిణయం సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అందులో భాగంగానే ఈ విషయాన్ని వెల్లడించారు. విజయ్ భాస్కర్ రూపొందించిన నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు అంటే తనకు ఇష్టమని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇకపోతే సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లి తిరిగి కోలుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో హిట్ అందుకున్నాడు. కానీ తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమా మాత్రం నిరాశపరిచింది. సత్య అనే షార్ట్ ఫిలిం చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.. ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. 1940 సంవత్సర కాలంలో జరిగిన కథను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.. ఈ సినిమా ద్వారా కొత్త డైరెక్టర్ రాకేష్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా, హనుమాన్ మూవీ నిర్మాతలు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు