NTR30: తారక్‌ను ఢీ కొట్టేందుకు బాలీవుడ్ అగ్ర నటుడు

ఎన్టీఆర్ 30 సినిమా రోజు, రోజుకి అంచనాలు పెంచుతూపోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా స్టార్ట్ అయింది. శంషాబాద్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఫైట్ సీక్వెన్స్ తో సినిమాని స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లో రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమాకి సంబంధించి రెండో షెడ్యూల్ లో జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ మధ్య సీన్స్ ని తెరకెక్కించనున్నారు కొరటాల శివ . హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. అయితే అందరిని ఆశ్చర్య పరిచే విధంగా ఎన్టీఆర్30 సెట్ కి ఒక బాలీవుడ్ నటుడు ఎంట్రీ ఇచ్చాడు అతను ఎవరో కాలేదు సైఫ్ అలీ ఖాన్.

అవును ఆ మధ్య ఎన్టీఆర్ 30 లో విలన్ రోల్ కోసం కొరటాల ,సైఫ్ ని కలిశారు. కథ కూడా కూడా వినిపించారు. కానీ ఏమైందో కానీ తరువాత ఆ న్యూస్ పై అఫిషల్ కన్ఫర్మేషన్ ఏమి రాలేదు. ఇక వెబ్ సైట్ లలో ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు సైఫ్ కొరటాల చెప్పిన స్టోరీ ని రిజెక్ట్ చేసాడని రాయటం స్టార్ట్ చేసారు.

- Advertisement -

అయితే ఎన్టీఆర్ 30లాంచ్ ఈవెంట్ లో కూడా జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ తప్ప వేరే నటులు కనిపించకపోవటంతో ఆ రాతలే నిజం అని అందరు అనుకున్నారు. అయితే అసలు సినిమాలో విలన్ ఎవరు అనే ప్రశ్న ఫస్ట్ షెడ్యూల్ కంప్లిట్ అయ్యేనాటికి కూడా ఏ న్యూస్ బయటికి రాలేదు. ఇప్పుడు సైఫ్ ఎంట్రీ తో ఈ కామెంట్స్ అన్నిటికి తాళం వేసినట్టు అయింది. RRR సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో పక్క ఆచార్య సినిమాతో ఘోరమైన పరాజయం చుసిన కొరటాల ఈ సినిమాతో మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి పకడ్బందీగా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు