ఎన్టీఆర్ 30 సినిమా రోజు, రోజుకి అంచనాలు పెంచుతూపోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా స్టార్ట్ అయింది. శంషాబాద్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఫైట్ సీక్వెన్స్ తో సినిమాని స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లో రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు.
ఈ సినిమాకి సంబంధించి రెండో షెడ్యూల్ లో జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ మధ్య సీన్స్ ని తెరకెక్కించనున్నారు కొరటాల శివ . హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. అయితే అందరిని ఆశ్చర్య పరిచే విధంగా ఎన్టీఆర్30 సెట్ కి ఒక బాలీవుడ్ నటుడు ఎంట్రీ ఇచ్చాడు అతను ఎవరో కాలేదు సైఫ్ అలీ ఖాన్.
అవును ఆ మధ్య ఎన్టీఆర్ 30 లో విలన్ రోల్ కోసం కొరటాల ,సైఫ్ ని కలిశారు. కథ కూడా కూడా వినిపించారు. కానీ ఏమైందో కానీ తరువాత ఆ న్యూస్ పై అఫిషల్ కన్ఫర్మేషన్ ఏమి రాలేదు. ఇక వెబ్ సైట్ లలో ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు సైఫ్ కొరటాల చెప్పిన స్టోరీ ని రిజెక్ట్ చేసాడని రాయటం స్టార్ట్ చేసారు.
అయితే ఎన్టీఆర్ 30లాంచ్ ఈవెంట్ లో కూడా జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ తప్ప వేరే నటులు కనిపించకపోవటంతో ఆ రాతలే నిజం అని అందరు అనుకున్నారు. అయితే అసలు సినిమాలో విలన్ ఎవరు అనే ప్రశ్న ఫస్ట్ షెడ్యూల్ కంప్లిట్ అయ్యేనాటికి కూడా ఏ న్యూస్ బయటికి రాలేదు. ఇప్పుడు సైఫ్ ఎంట్రీ తో ఈ కామెంట్స్ అన్నిటికి తాళం వేసినట్టు అయింది. RRR సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో పక్క ఆచార్య సినిమాతో ఘోరమైన పరాజయం చుసిన కొరటాల ఈ సినిమాతో మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి పకడ్బందీగా సినిమాని తెరకెక్కిస్తున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.