Samantha – Chaithanya: వేణు స్వామి విడాకుల వార్త భూటకం.. అలా నిజాలు బయట చెప్పిన ఆర్పీ..!

Samantha – Chaithanya.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది సమంత ఈ సినిమాలో తనతో పాటు నటించిన నాగచైతన్యను ప్రేమించిన ఈమె.. దాదాపు 7 సంవత్సరాల పాటు తమ ప్రేమను మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇక చివరిగా అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం సినిమా తర్వాత తమ ప్రేమను ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగచైతన్య – సమంత వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లోనే క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడికి ఇప్పటికీ అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు.

విడాకుల తర్వాత సమంత టార్గెట్..

Samantha - Chaithanya: The news of Venu Swamy's divorce is a hoax.. and RP revealed the truth..!
Samantha – Chaithanya: The news of Venu Swamy’s divorce is a hoax.. and RP revealed the truth..!

ఇకపోతే నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన వీరు ఉన్నట్టుండి 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి? ఎవరి వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..? అనే విషయాలు వైరల్ కాగా.. ఎక్కువగా చాలామంది సమంతను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు మరింత చర్చనీయాంశంగా మారాయి.. ఇకపోతే ప్రముఖ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో ఈమెకు అలాంటి సంబంధం ఉందని.. ఆ కారణంతోనే నాగచైతన్య ఈమెకు విడాకులు ఇచ్చారనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.. ఈ విషయంపై ప్రీతం కూడా స్పందించి సమంతా తనకు అక్క లాంటిది అని క్లారిటీ ఇచ్చినా.. ఈమెపై మాత్రం రూమర్లు రాకెట్ల లా విస్తరించాయి.

విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి..

ఇదిలా ఉండగా ఈ విడాకుల విషయం తర్వాత మరొక వార్త తెరపైకి వచ్చింది. వీరిద్దరూ విడిపోతారని వేణు స్వామి ముందే చెప్పారని.. అందుకే వీరు విడిపోయారని.. వేణు స్వామి చెప్పే జాతకం నిజం అవుతుందని చాలామంది నమ్మారు.. అయితే తాజాగా ఈ విషయాలపై జబర్దస్త్ కమెడియన్ ప్రముఖ నటుడు కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ .. వేణు స్వామి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్రాక్ ఆర్పి మాట్లాడుతూ వేణు స్వామి పై విరుచుకుపడ్డారు.. ఉదయం లేవగానే మటన్, మందు లేనిదే రోజు గడవదని.. అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తారని తెలిసిందని కామెంట్లు చేసిన ఈయన.. సమంత – నాగచైతన్య విడిపోతారని అసలు వేణు స్వామికి తెలియదని.. అతడికి జాతకం చెప్పడం రాదు అని.. ఎక్కడో పెద్ద వాళ్ళ ఇళ్లల్లో జరిగే సమస్యల గురించి ఇతడికెలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు..

- Advertisement -

అదంతా డ్రామా అంటున్నా కిర్రాక్ ఆర్పీ..

ఈ విషయంపై కిర్రాక్ ఆర్పి మాట్లాడుతూ.. అస్తవ్యస్తంగా ఉండే వేణు స్వామి ఉదయం లేవగానే సెలబ్రిటీలు ఏ పబ్ కి అయితే వెళ్తారో.. ముందుగా ఆ పబ్ కు వెళ్లి అక్కడ కూర్చుంటాడు.. ఆ సెలబ్రెటీలు ఐదో పెగ్, లేదా ఆరో పెగ్గుకి వచ్చినప్పుడు వారు ఫోన్లో మాట్లాడే సంభాషణలను చాటుగా వింటాడు. సమంత, నాగచైతన్య విషయంలో కూడా అదే జరిగింది.. ఎవరో ఎప్పుడో, ఎక్కడో మాట్లాడుతుంటే అది వినేసి కామెంట్ చేశాడు.. నిజానికీ ఒక జంట మధ్య విభేదాలు వస్తే ఉదయానికే విడాకులు తీసుకోరు కదా.. నాలుగు ఐదు నెలల ముందు నుంచి ఈ వ్యవహారం జరుగుతూ ఉంటుంది.. ఆయా పెద్ద వాళ్ళు కూడా చర్చలు జరిపిన తర్వాత వీరి బాధలును అర్థం చేసుకొని విడిపోమని చెబుతారు.. ఆ నాలుగు నెలల సంఘర్షణ ముందే వీడు ఎవరో ఒకరు మాట్లాడుకుంటుంటే తెలుసుకొని.. అప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి మెడలో జంజం వేసి, నుదుటిని బొట్టు పెట్టి సమంత నాగచైతన్య విడిపోతారంటూకామెంట్లు చేశాడు. కొంతమంది జనాలు అనే గొర్రెలు.. వీడి చెప్పే మాటలు నిజమని నమ్ముతున్నారు.. నిజంగా వీడు అసలు జాతకాలే తెలియనోడు.. ఇలా ఎలా కామెంట్ లు చేస్తాడు ..నాగచైతన్య సమంత విడిపోతారని వాడు జాతకం చూసి చెప్పలేదు.. అదంతా ఒక భూటకం అంటూ విచక్షణారహితంగా కామెంట్లు చేస్తూ రెచ్చిపోయాడు కిర్రాక్ ఆర్పీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు