Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలు ఈ మధ్య తెలుగులో రాలేదు. అలాగని వేరే భాషల్లో కూడా రాలేదు. అయితే కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తుంది. గత రెండేళ్ల క్రితం ఆమె అరుదైన వ్యాధి బారిన సంగతి తెలిసిందే. దాని నుంచి కాస్త కోలుకోగానే సైన్ చేసిన సినిమాలు పూర్తి చేసింది. కానీ ఆ సినిమాలు నిరాశ పరిచాయి. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమాకు కూడా సైన్ చెయ్యలేదు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ రేంజులో ఫోటోలను షేర్ చేస్తుందో మనం చూస్తున్నాం. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కాలికి ఏదో అయ్యినట్లు ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
గతంలో సామ్ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి… కుర్రాళ్లకు సెగలు పుట్టించేలా ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా కాలు ఫోటోను షేర్ చేసింది. ఏదో ఇంజ్యుర్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆ ఫోటోను తన స్టేటస్ లో పెట్టుకుంది. ఇక ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తూ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ అమ్మడు ముంబైలో కొత్త ఇల్లు కూడా కొన్నది. ఆ ఫోటోలు కూడా ఆ మధ్య నెట్టింట ట్రెండ్ అయ్యాయి. ఇక సామ్ వరుణ్ దావన్తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె ముంబయికి వెళ్లింది. అక్కడి మిగిలిన షూటింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.. షూటింగ్ టైం తీసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. సమంత ఇటీవల ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపింది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసింది. ఈ సిరీస్ తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నా అని ప్రకటించింది. మరో ఏడాది పూర్తి అయిన కూడా ఇంకా సినిమాలు ప్రకటించలేదు.. కొత్తగా ఆమె దేనికి కమిట్ కాలేదని పీఆర్ టీమ్ తెలిపింది. ఈ లెక్కన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఉండబోదని తెలుస్తుంది.. అసలు తెలుగులో సినిమాలు చేస్తుందా లేదా చూడాలి..