Samantha: ఏపీలో కొత్త బిజినెస్‌ పెట్టబోతున్న సమంత ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సమంత అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. దాదాపు నాలుగేళ్లు కలిసున్న వీరిద్దరూ ప్రస్తుతం విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఇక చాలా రోజులు పాటు ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ప్రస్తుతం పూర్తిగా కోలుకొని సినిమాల్లో మళ్లీ నటిస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ తన పూర్తి ధ్యాస అంతా బాలీవుడ్ ఇండస్ట్రీపైనే పెట్టింది.

- Advertisement -

Samantha is going to start a new business in AP

ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. పలు వెబ్ సిరీస్ లలోను నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్నో చిత్రాల్లో నటించిన సమంత భారీగానే డబ్బులను సంపాదించింది. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గాను వ్యవహరిస్తూ డబ్బులను కూడబెట్టుకుంటుంది. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లోనూ సమంత చాలా చురుగ్గా పాల్గొంటారు. ఎప్పుడు వీటన్నింటితో బిజీగా ఉండే సమంత తాజాగా ఏపీలో క్లాత్ కు సంబంధించిన షోరూం ఓపెన్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. వైజాగ్, విజయవాడ వంటి పెద్ద నగరాల్లో ఈ బ్రాంచీలు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు