Samantha: మౌనం వీడింది

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కుందనపు బొమ్మ సమంత ఎంతోమంది కుర్రాకారు మనసును మాయ చేసింది.
ఇప్పటికి ప్రతి ప్రేక్షకుడికి జెస్సి పాత్ర కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. సమంత కెరియర్ లో కొన్ని ప్లాప్ సినిమాలు వచ్చిన ఆమె ఇమేజ్ మాత్రం డామేజ్ కాలేదు.

అక్కినేని నాగ చైతన్య తో ఆటో నగర్ సూర్య, “మనం” లాంటి సినిమాలు చేయడమే కాకుండా రియల్ లైఫ్ లో తన ప్రేమ ను నిలబెట్టుకుని
అక్కినేని కుటుంబానికి కోడలి గా మారింది సమంత.
కానీ ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయబేధాలు రావడం వలన ఐదవ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని మరియు చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయనేది తెలిసిన విషయమే.

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన పని తాను చేసుకుంటూ, తాను చేయబోయే సినిమాలతో బిజీగా గడుపుతూ, గత కొన్ని నెలలుగా చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ 7 లో పాల్గొన్న సమంత, నాగ చైతన్యతో జరిగిన విడాకుల గురించి ఆమె మౌనం వీడినట్లు తెలుస్తోంది. చై మరియు సామ్ ఇద్దరూ ఇప్పటివరకు బహిరంగ వేదికలపై ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఈ షో లో కూడా ఆ ప్రశ్నను సామ్ చాలా డిగ్నిఫైడ్ గా హ్యాండిల్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత యశోద, ఖుషి, శాకుంతలం చిత్రాల్లో నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు