Samantha : ఇంకా చావుతో పోరాడుతున్నా..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి విధితమే. యశోద సినిమా రిలీజ్ కు ముందు తనకు ఈ వ్యాధి ఉందని సమంత అధికారిక ప్రకటన చేసింది. దీంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మయోసైటిస్ వల్ల సమంత ఇప్పటికే సాధారణ జీవితానికి దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈమె ఇంకా చికిత్స తీసుకుంటుంది. అందుకోసం విదేశాలకు కూడా వెళ్తోందని సమాచారం.

ఇది ఇలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా యంగ్ హీరో రాహుల్ రవిచంద్రన్ సమంతకు పవర్ ఫుల్ వర్డ్స్ తో ఒక సందేశాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇంస్టాగ్రామ్ లో సమంత ని ట్యాగ్ చేస్తూ ఈ సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ‘ప్రస్తుతం నువ్వు చీకటి దారిలో ప్రయాణం సాగిస్తూ ఉండొచ్చు. కానీ త్వరలోనే ఆ దారి ప్రకాశం తో నిండిపోతుంది. ప్రస్తుతం నీ శరీరభాగాల కదిలిక కాస్త కష్టం గా అనిపించొచ్చు. కానీ త్వరలోనే అవి మామూలు స్థితికి చేరుకుంటాయి. ఎందుకంటే నువ్వు ఉక్కు మహిళవి. పోరాడడం నీ నైజం. గెలుపొందడం నీ హక్కు. ఎలాంటి కఠినతరమైన పరిస్థితులు ఎదురైనా నిన్ను ఓడించలేవు. ఇలాంటివి జీవితం ఎన్నో చూసావు. అవన్నీ నీ విజయానికి మెట్లు గా నిలుస్తాయి’ అంటూ రాహుల్ రవి చంద్రన్ రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ ను సమంత షేర్ చేస్తే ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘కఠినతరమైన పరిస్థితులు ఎదురుకుంటున్న వాళ్ళందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి. నేను ఇంకా చావు తో పోరాడుతున్నాను. మీరు కూడా అలాగే ఉండండి. అవే మనల్ని ఇంకా బలవంతులను చేస్తాయి’ అంటూ సామ్ చేసి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సమంత అభిమానుల కంటి నుంచి నీళ్లు తెప్పిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు