Samyuktha Menon.. ఈ మధ్యకాలంలో మలయాళం ముద్దుగుమ్మలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అలా వచ్చి ఆకట్టుకున్న వారిలో హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఒకరు. మొదట పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంతో రానా భార్యగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించింది. బింబిసారా, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా సంయుక్త క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో లక్కీ హీరోయిన్ అని ముద్ర కూడా పడిపోయింది.
డైరెక్టర్ తో ఎఫైర్ రూమర్స్..
వరుసగా సంయుక్తాకు ఆఫర్లు రావడం వెనుక డైరెక్టర్ త్రివిక్రమ్ హస్తము ఉందనే విధంగా కూడా గతంలో రూమర్స్ వినిపించాయి. గత ఏడాది ఒకేసారి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మాత్రం కాస్త టైమ్ తీసుకుని మరీ సినిమా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ క్రమంలోనే కొత్త సినిమాలకు పెద్దగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా చిత్రమైన స్వయంభూ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో హీరోగా నిఖిల్ నటిస్తూ ఉన్నారు.
తన తండ్రి వల్లే పేరు మార్చుకున్న సంయుక్త..
బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సంయుక్తా మీనన్ వ్యక్తిగత విషయానికి వస్తే మాత్రం.. ఈ ముద్దుగుమ్మ కూడా గాయపడిన సందర్భం గురించి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. ముఖ్యంగా తన పేరు సంయుక్త మీనన్.. నుంచి మీనన్ అనే పేరును తొలగించిందట. అయితే అలా మీనన్ పేరు తొలగించడం వెనుక ఒక సంఘటన ఉందని తెలియజేసింది. సంయుక్త తల్లితండ్రులు విడిపోయారని, సంయుక్త తల్లి అంటే ఆమెకు చాలా ఇష్టమట. అంతే కాకుండా గౌరవం కూడా అని తెలిపింది. తన తండ్రి మీద కోపంతో తన పేరు ఉన్న మీనన్ ను తీసేసింది సంయుక్త.
ఆడ ,మగ సమానం అంటున్న సంయుక్త..
తాను ఆడ , మగ అనే విషయంలో కచ్చితంగా సమానం అనే విషయాన్ని ఎక్కువగా నమ్ముతానని, ఎవరిని తక్కువ చేసి చూడకూడదని , తన జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఎదురయ్యింది అని తెలిపింది సంయుక్త. తన కుటుంబంలో ఎదురైన ఈ విషయం వల్ల తను ఎన్నోసార్లు బాధపడ్డానని కూడా తెలియజేసింది. ప్రస్తుతం సంయుక్త చేసిన కామెంట్లు సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే, విరూపాక్షా సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, మొదట ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నారట. కానీ ఆ పాత్రలో ఈమె సెట్ కాదని సంయుక్త అయితే పర్ఫెక్ట్ అని నమ్మిన డైరెక్టర్ ఆమెకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆమె తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి మంచి విజయాన్ని అందుకుంది.