Sandalwood : క్రేజ్ వచ్చిందా.. ఛలో టాలీవుడ్

గతంలో టాలీవుడ్ చిన్న ఇండస్ట్రీ. ఇక్కడ వచ్చే సినిమాలు తెలుగు ప్రేక్షకులు మినహా ఎవరూ కూడా పెద్దగా చూసేవారు కాదు. ఇతర ఇండస్ట్రీల్లో కూడా టాలీవుడ్ నటీనటులకు గుర్తింపు కూడా అంతంత మాత్రమే. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా పలు సార్లు ప్రస్తావించారు. తనకు బాలీవుడ్ లో ఒక ఫంక్షన్ లో ఎదురైన అనుభవాన్ని కూడా ఓ సందర్భంలో పంచుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టాలీవుడ్ స్థాయి పెరిగింది. సినీ ప్రపంచాన్నే తెలుగు చిత్ర సీమ వైపునకు తిప్పుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమా వస్తుందంటే ఇతర భాష ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురూచూస్తున్న రోజులు వచ్చాయి.

ఇతర ఇండస్ట్రీల హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు కన్నడ చిత్ర సీమ కూడా ఇటీవల బాగానే ఎదిగింది. అయినా, కన్నడ ప్రేక్షకులు మాత్రం సినీ స్టార్లపై కోపంగానే ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. కన్నడలో ఒక సినిమా చేసి, కొంత క్రేజ్ తెచ్చుకున్న వెంటనే టాలీవుడ్ కు షిఫ్ట్ అవుతున్నారు. దీంతో వారిపై కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదట రష్మిక మందన్నా కన్నడ సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు శాండిల్ వుడ్ లో మినహా అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంది. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇతర భాషల హీరోలనే డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో ప్రభాస్, తారక్ హీరోలుగా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈయన పై కూడా కన్నడ సినీ ప్రేమికులు పీకల్లోతు కోపంతో ఉన్నారు.

- Advertisement -

ఇలా కన్నడ సినిమాతో క్రేజ్ తెచ్చుకుని ఇతర భాషలో సినిమా చేసే వారి లిస్ట్ లో తాజాగా రిషబ్ శెట్టి చేరిపోయాడు. రిషబ్ ఇటీవల కాంతార అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కన్నడతో పాటు అన్ని భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. దీంతో రిషబ్ తో సినిమా చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేస్తానని రిషబ్ శెట్టి హామీ కూడా ఇచ్చాడు. దీంతో శాండిల్ వుడ్ ప్రేక్షకుల ఆగ్రహానికి రిషబ్ శెట్టి గురవుతున్నాడు.

కన్నడ ప్రేక్షకులు ఆదరిస్తే స్టార్ హోదా తెచ్చుకుని ఇప్పుడు శాండిల్ వుడ్ లో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేయడమేంటి అని మండిపడుతున్నారు. ఈ వివాదంపై ఈ ముగ్గురు నటీనటులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు