Sarkaru Vaari Paata : మనసు మార్చుకున్న “సర్కారు వారు”

‘సర్కారు వారి పాట’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతానికైతే బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసేది. తెలంగాణలో ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడం వల్లన అక్కడి కలెక్షన్లు డల్ గా ఉంటున్నాయి. సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే జనాలు ఇలా ఆలోచించేవారు కాదు. గత రెండు, మూడు నెలలుగా ‘భీమ్లా నాయక్’, ‘రాధే శ్యామ్’, ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ‘ఆచార్య’ వంటి బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి టికెట్ రేట్లు పెంచేయడం వల్ల.. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ పై ప్రభావం పడింది.

దీంతో తెలంగాణలో ‘సర్కారు వారి పాట’ టికెట్ రేట్లు తగ్గించాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. సోమవారం నుండీ మల్టీప్లెక్స్ వంటి వాటిల్లో మినిమమ్ టికెట్ ధర రూ.175 రూపాయలు ఉంటుంది. అటు పై అయితే రూ.200,రూ.250 వరకు ఉండొచ్చు. ఇక సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, రూ.150 అలా ఉండొచ్చు. మినిమమ్ రూ.50 గా ఉండొచ్చు. సోమవారం నుండీ ఈ రేట్లు అమలులోకి వస్తాయని టాక్ నడుస్తుంది. రేపు సాయంత్రం.. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావచ్చు అనేది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు