Seerat Kapoor: రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సిరత్ కపూర్. తెలుగులో పలు మూవీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఇక 2020లో మా వింత గాధ వినుమా చిత్రం తర్వాత మరో మూవీ చేయలేదు.
ఇక రీసెంట్ గా మనమే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ బ్యూటీ. యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమానే మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందించారు.
ఇక ఇందులో మాస్టర్ విక్రమ్, సీంత్ కపూర్, ఆయేష, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ జూన్ 7 నా ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ గా రానుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో సెలబ్రేట్ చేశారు మేకర్స్. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది సిరత్ కపూర్. రెడ్ కలర్ శారీలో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.